వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. బూతుల నేతగా టీడీపీ నాయకులు ముద్దుగా పిలుచుకుని కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. గత ఎన్నికల్లో గుడివాడలో ఓడిపోయిన తర్వాత..ఆయన అజాలేకుండా పోయారు. కొన్నాళ్లు అనారోగ్యం అని చెప్పారు. ఆ తర్వాత.. హైదరాబాద్లో చికిత్స తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత .. అక్కడెక్కడో కనిపించినా.. ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.
తాజాగా మాజీ మంత్రి, ఇటీవల సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అంబటి రాంబాబును కొడాలి నాని ఆదివారం సాయంత్రం పరామర్శించారు. నేరుగా గుంటూరులోని అంబటి నివాసానికి వచ్చిన కొడాలి ఆయనను పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన కొడాలి `రెడ్ బుక్`కు ఎవరూ భయపడడం లేదని చెప్పారు. రెడ్బుక్లు వంద రాసుకున్నా.. మాకేమీ కాదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం బెదిరింపులకుఎవరూ భయపడబోరని కొడాలి వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీసులు మనక్షోభకు గురి చేశారని అన్నారు. తను ఫ్రెస్ట్రేషన్లో చేసిన వ్యాఖ్యల విషయంలో రాంబాబు చింతించారని.. తర్వాత.. ఆయన క్షమాపణలు కూడా చెప్పారని అన్నారు. అయినప్పటికీ కక్ష పూరితంగా కేసు పెట్టి.. ఆయనను జైల్లో పెట్టారని విమర్శించారు. అంబటి ఇంటిపై రాళ్లు కర్రలతో దాడులు చేసి కార్లు, ఇంటి అద్దాలను ధ్వంసం చేసిన వారిని మాత్రం ప్రభుత్వం రక్షించిందని దుయ్యబట్టారు.
అది భ్రమ!
మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఆయన రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో ఆయనే మరిచిపోయాడంటే.. అది రెడ్ బుక్కేనా? ఇంకేమైనా బుక్కా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడబోరని వ్యాఖ్యానించారు. 2029లో ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కొడాలి ధృమా వ్యక్తం చేశారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…