మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం చేయబోతోంది. కొడుకు ప్రణవ్ ఆల్రెడీ హీరో అయిపోయి సెటిలయ్యే క్రమంలో ఉండగా ఇప్పుడు తనయ వంతు వచ్చింది. నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. విశేషం ఏమిటంటే ఇందులో మోహన్ లాల్ కూడా నటించారు. అది గెస్ట్ రోలా లేక ఎక్కువ కనిపించే స్పెషల్ క్యామియోనా అనేది వేచి చూడాలి. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతానికి రావడం లేదు.
అసలు విషయానికి వస్తే విస్మయ మోహన్ లాల్ డెబ్యూకి క్రైమ్ థ్రిల్లర్ నే ఎంచుకుంది. దృశ్యం షేడ్స్ చాలానే కనిపిస్తున్నాయి. ఒక హిల్ స్టేషన్ లో చదువు, ఉద్యోగం కోసం వెళ్లిన ఓ చిన్న కుటుంబం అనుకోకుండా ప్రమాదంలో పడుతుంది. రాత్రి అయితే చాలు ఆగంతకుల వల్ల అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అసలు వీళ్ళను వెంటాడుతున్నది ఎవరు, పోలీసుల వచ్చేంత తప్పు అక్కడేం జరిగిందనేది అసలు స్టోరీగా అర్థమవుతోంది. ట్విస్టులు చాలానే ఉన్నాయి.
లుక్స్ పరంగా విస్మయ చాలా బొద్దుగా ఉంది. తండ్రి పోలికను పుణికిపుచ్చుకున్న ఈ అమ్మాయి పెర్ఫార్మన్స్ గురించి కేవలం ట్రైలర్ చూసి అంచనాకు రాలేం కానీ చూపించిన కాసిన్ని సీన్స్ లోనూ హుషారుగా చలాకీగా కనిపించింది. మాములుగా స్టార్ హీరోల కూతుళ్లను తెరమీదకు తీసుకురావడాన్ని ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరు. కమల్ హాసన్ లాగే మోహన్ లాల్ కూడా వాటిని పట్టించుకునే ఉద్దేశంలో లేరు. అందుకే వారసురాలిని ప్రోత్సహిస్తున్నారు.
మలయాళం డబ్బింగులు థియేటర్ పరంగా మన దగ్గర అంతగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఒరిజినల్ వెర్షన్ ఫలితం చూశాక అప్పుడు నిర్ణయం తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ళ క్రితం కేరళ వరదల మీద 2018 లాంటి అద్భుతమైన సినిమా తీసిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ దానికి దర్శకుడు కావడం విశేషం. విస్మయు కనక ఈ తుదక్కంతో మెప్పించగలిగితే ఇదే తరహాలో స్వంత బ్యానర్ లో వరసగా సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారట. చూడాలి మరి ఏమవుతుందో.
This post was last modified on August 4, 2026 10:21 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…