మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్లైన్స్కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ జాబితాలో ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను తనిఖీ చేయగా, ఏకంగా 137 విమానాల్లో లోపాలు బయటపడ్డాయి. అంటే దాదాపు 72 శాతం విమానాల్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో కూడా 148 విమానాలు ఇలాంటి రిపీటెడ్ డిఫెక్ట్స్తో నడుస్తున్నాయని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర సంస్థలైన స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ విమానాల్లోనూ కొన్ని లోపాలను గుర్తించారు.
డీజీసీఏ ఈ ఏడాది కాలంలో వేల సంఖ్యలో తనిఖీలు నిర్వహించి ఈ గణాంకాలను సేకరించింది. విమానాల్లోని సెన్సార్లు, ఇంజిన్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఒకసారి రిపేర్ చేసినా మళ్లీ తలెత్తడం ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ లోపాలపై నిఘా పెంచుతూనే, విమానయాన రంగంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టెక్నికల్ పోస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు వివరించింది.
అయితే ఈ రిపోర్టుపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాము భద్రత విషయంలో రాజీ పడకుండా విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. విమానాల్లో బయటపడ్డ లోపాల్లో చాలా వరకు సీట్లు, ట్రే టేబుల్స్, వినోదపు స్క్రీన్లకు సంబంధించినవేనని, ఇవి విమాన భద్రతకు ముప్పు కలిగించేవి కావని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. రాబోయే రెండేళ్లలో విమానాలను ఆధునీకరించే క్రమంలో ఈ చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎయిర్లైన్స్ కంపెనీలు ఎన్ని కారణాలు చెప్పినా, ప్రయాణికులు మాత్రం తమ జర్నీ సేఫ్గా సాగుతుందా లేదా అనే ఆందోళనలోనే ఉన్నారు. పదే పదే లోపాలు రావడం అనేది మెయింటెనెన్స్ లోపాన్ని సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 6, 2026 6:44 pm
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…
పదిమందిని మెప్పించగల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆకర్షించగల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాలన్నీ మీవే!. త్వరలోనే..…
“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నగరిలో ఏం జరుగుతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్రస్తుతం సైలెంట్గానే…
కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో…