Trends

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ జాబితాలో ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను తనిఖీ చేయగా, ఏకంగా 137 విమానాల్లో లోపాలు బయటపడ్డాయి. అంటే దాదాపు 72 శాతం విమానాల్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో కూడా 148 విమానాలు ఇలాంటి రిపీటెడ్ డిఫెక్ట్స్‌తో నడుస్తున్నాయని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర సంస్థలైన స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ విమానాల్లోనూ కొన్ని లోపాలను గుర్తించారు.

డీజీసీఏ ఈ ఏడాది కాలంలో వేల సంఖ్యలో తనిఖీలు నిర్వహించి ఈ గణాంకాలను సేకరించింది. విమానాల్లోని సెన్సార్లు, ఇంజిన్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఒకసారి రిపేర్ చేసినా మళ్లీ తలెత్తడం ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ లోపాలపై నిఘా పెంచుతూనే, విమానయాన రంగంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టెక్నికల్ పోస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు వివరించింది.

అయితే ఈ రిపోర్టుపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాము భద్రత విషయంలో రాజీ పడకుండా విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. విమానాల్లో బయటపడ్డ లోపాల్లో చాలా వరకు సీట్లు, ట్రే టేబుల్స్, వినోదపు స్క్రీన్‌లకు సంబంధించినవేనని, ఇవి విమాన భద్రతకు ముప్పు కలిగించేవి కావని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. రాబోయే రెండేళ్లలో విమానాలను ఆధునీకరించే క్రమంలో ఈ చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎన్ని కారణాలు చెప్పినా, ప్రయాణికులు మాత్రం తమ జర్నీ సేఫ్‌గా సాగుతుందా లేదా అనే ఆందోళనలోనే ఉన్నారు. పదే పదే లోపాలు రావడం అనేది మెయింటెనెన్స్ లోపాన్ని సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on February 6, 2026 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

23 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago