Trends

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ జాబితాలో ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను తనిఖీ చేయగా, ఏకంగా 137 విమానాల్లో లోపాలు బయటపడ్డాయి. అంటే దాదాపు 72 శాతం విమానాల్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో కూడా 148 విమానాలు ఇలాంటి రిపీటెడ్ డిఫెక్ట్స్‌తో నడుస్తున్నాయని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర సంస్థలైన స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ విమానాల్లోనూ కొన్ని లోపాలను గుర్తించారు.

డీజీసీఏ ఈ ఏడాది కాలంలో వేల సంఖ్యలో తనిఖీలు నిర్వహించి ఈ గణాంకాలను సేకరించింది. విమానాల్లోని సెన్సార్లు, ఇంజిన్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఒకసారి రిపేర్ చేసినా మళ్లీ తలెత్తడం ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ లోపాలపై నిఘా పెంచుతూనే, విమానయాన రంగంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టెక్నికల్ పోస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు వివరించింది.

అయితే ఈ రిపోర్టుపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తాము భద్రత విషయంలో రాజీ పడకుండా విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది. విమానాల్లో బయటపడ్డ లోపాల్లో చాలా వరకు సీట్లు, ట్రే టేబుల్స్, వినోదపు స్క్రీన్‌లకు సంబంధించినవేనని, ఇవి విమాన భద్రతకు ముప్పు కలిగించేవి కావని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. రాబోయే రెండేళ్లలో విమానాలను ఆధునీకరించే క్రమంలో ఈ చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎన్ని కారణాలు చెప్పినా, ప్రయాణికులు మాత్రం తమ జర్నీ సేఫ్‌గా సాగుతుందా లేదా అనే ఆందోళనలోనే ఉన్నారు. పదే పదే లోపాలు రావడం అనేది మెయింటెనెన్స్ లోపాన్ని సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Satya

Recent Posts

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

2 minutes ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

8 minutes ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

22 minutes ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

1 hour ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

1 hour ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

4 hours ago