బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన.. కేసీఆర్ కుటుంబంతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్లకు ఇప్పుడు ఆత్మ బంధువు ఎవరైనా ఉంటే.. ఆయన కిషన్ రెడ్డేనని చెప్పారు.
గంగాపురం కిషన్ రెడ్డి ఇప్పుడు.. కల్వకుంట్ల కిషన్ రెడ్డి రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తాము పెడుతున్న కేసులను కేంద్రంలో అడ్డుకుని కేసీఆర్ కుటుంబానికి మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతకన్నా తెలంగాణకు కిషన్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్నివెనుకేసుకున్నారని.. మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఈ-ఫార్ములా రేస్ ద్వారా కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ కేసులను తాము ముందుకు తీసుకువెళ్తుంటే.. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని.. వారిని ఆయనే కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్లను ఎప్పుడు అరెస్టు చేస్తారో.. కిషన్ రెడ్డే చెప్పాలని ప్రశ్నించారు.
దీనితో కిషన్ రెడ్డే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానీ ఇంకా స్పందించలేదు.
This post was last modified on February 7, 2026 8:35 am
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…