బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన.. కేసీఆర్ కుటుంబంతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్లకు ఇప్పుడు ఆత్మ బంధువు ఎవరైనా ఉంటే.. ఆయన కిషన్ రెడ్డేనని చెప్పారు.
గంగాపురం కిషన్ రెడ్డి ఇప్పుడు.. కల్వకుంట్ల కిషన్ రెడ్డి రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తాము పెడుతున్న కేసులను కేంద్రంలో అడ్డుకుని కేసీఆర్ కుటుంబానికి మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతకన్నా తెలంగాణకు కిషన్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్నివెనుకేసుకున్నారని.. మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఈ-ఫార్ములా రేస్ ద్వారా కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ కేసులను తాము ముందుకు తీసుకువెళ్తుంటే.. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని.. వారిని ఆయనే కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్లను ఎప్పుడు అరెస్టు చేస్తారో.. కిషన్ రెడ్డే చెప్పాలని ప్రశ్నించారు.
దీనితో కిషన్ రెడ్డే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానీ ఇంకా స్పందించలేదు.
This post was last modified on February 7, 2026 8:35 am
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…