“రూపాయి విలువ పడిపోయింది” అనే వార్త చూడగానే.. “మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా” అని లైట్ తీసుకుంటే పొరపాటే. డాలర్ విలువ 90 రూపాయలు దాటడం అనేది కేవలం మార్కెట్ గణాంకం కాదు, మన వంటింట్లో, మన పిల్లల చదువుల్లో మోగిన డేంజర్ బెల్. ఈ పతనం ప్రభావం సామాన్యుడి మీద డైరెక్ట్గా ఉండదు కానీ, ఇన్ డైరెక్ట్గా మన బడ్జెట్ను తలకిందులు చేసే ప్రమాదం ఉంది.
అందరికంటే ఎక్కువగా నష్టపోయేది విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులే. నిన్నటి దాకా ఒక డాలర్కి 83, 84 రూపాయలు పంపిన వాళ్లు, ఇప్పుడు 90 రూపాయలు పంపాలి. అంటే ఫీజుల రూపంలో, ఖర్చుల రూపంలో అదనంగా లక్షల రూపాయల భారం పడుతుంది. ఇప్పటికే లోన్లు తీసుకుని పిల్లలను పంపిన వారికి, ఈ మారిన రేటు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికాలో చదువు అనేది ఇప్పుడు మరింత కాస్ట్లీ వ్యవహారంగా మారింది.
ఇక ఎలక్ట్రానిక్స్ ప్రియులకు కూడా ఇది చేదు వార్తే. మనం వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల విడిభాగాల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. డాలర్ రేటు పెరిగితే, ఆటోమేటిక్గా వాటి ధరలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో కొత్త గ్యాడ్జెట్స్ కొనాలంటే జేబుకు గట్టిగానే చిల్లు పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలోనే చెల్లిస్తాం కాబట్టి, పరోక్షంగా రవాణా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది.
అయితే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. రూపాయి ఇంతలా పతనమవుతున్నా మన రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎందుకు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు? సాధారణంగా డాలర్లను అమ్మి రూపాయిని కాపాడుతుంది. కానీ ఈసారి ఆర్బీఐ “సైలెంట్ మోడ్”లో ఉంది. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అదుపులోనే ఉంది కాబట్టి, రూపాయిని బలవంతంగా ఆపడం కంటే, దేశ ఎకానమీ గ్రోత్ మీదే ఫోకస్ పెట్టాలని ఆర్బీఐ డిసైడ్ అయినట్లు నిపుణులు అంటున్నారు. ఇదొక వ్యూహాత్మక మౌనం అనుకోవచ్చు.
అమెరికాతో జరగాల్సిన వాణిజ్య ఒప్పందం లేట్ అవ్వడమే ఈ కొంపముంచింది. ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడంతో రూపాయి కుదేలైంది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాబోయే రెండు నెలల్లో అంతా సెట్ అవుతుందా? లేక డాలర్ 100 వైపు పరుగులు పెడుతుందా? అనేది చూడాలి. ఏది ఏమైనా, ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న వాళ్లు, పిల్లలను బయటకు పంపేవాళ్లు మాత్రం తమ బడ్జెట్ను మళ్లీ లెక్కేసుకోవాల్సిందే.
This post was last modified on December 3, 2025 5:37 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…