ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని ఫలితాలను ఇపుడు దేశం గమనిస్తుంది. బాధ్యతగా వ్యవహారించాల్సిన న్యాయమూర్తులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యల్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తప్పు పట్టారు. దీని మీద చర్చ జరగాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అనే అంశం మీద నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు.
జడ్జీల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని, జడ్జీలను ఎంపిక చేసినప్పుడు సదరు వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను వెల్లడించడం లేదని, దాని వల్ల తగని వ్యక్తులు ఎంపికవుతున్నారని చెప్పారు. అలాంటి జడ్జీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ గౌరవం దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొలిజియం తీసుకునే నిర్ణయాలపై కొన్ని కారణాలను పేర్కొనడం జరిగేదని, ఇప్పుడది లేకుండా పోయిందన్నారు.
న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో సంచలనంగా మారాయి. కొందరు న్యాయవాదులు ఆయన కామెంట్స్ ని స్వాగతిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికి అత్యధిక శాతం న్యాయమూర్తులు మౌనంగా వుంటున్నారని, ఇప్పుడు ఉజ్జల్ భుయాన్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడ్డం ద్వారా పిల్లి మెడలో గంటకట్టారని చెబుతున్నారు. ఈ చర్చ ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సి వుంది.
This post was last modified on August 2, 2026 2:20 pm
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…