నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు ‘అ’ నుంచి ‘కోర్టు’ వరకు చిన్న సినిమాలు, ప్రియదర్శి లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ హీరోలతో ప్రాజెక్ట్లు చేస్తూ వచ్చిన నాని, ఇప్పుడు మెల్లగా ప్రొడక్షన్ పరంగా నెక్స్ట్ లీగ్లోకి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ ను సుధాకర్ చెరుకూరితో కలిసి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ ఆరంభంలోనే రెండేళ్ల క్రితం ఈ కాంబోను లాక్ చేసుకున్నారు. మెగాస్టార్ లాంటి బిగ్ లీగ్ హీరోతో సినిమా సెట్ చేసిన తర్వాత, నాని బ్యానర్ లో రాబోయే తదుపరి హీరో ఎవరనే దానిపై ఇండస్ట్రీలో రకరకాల టాక్స్ నడుస్తున్నాయి.
ఇందులో భాగంగానే యంగ్ హీరో నితిన్ తో ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతోందని, ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయిందనే ప్రచారం వైరల్ అవుతోంది. వచ్చే వారంలోనే పూజా కార్యక్రమం ఉంటుందట. కథ డిమాండ్ చేస్తే మెగాస్టార్ స్థాయి హీరోనే ప్రొడ్యూస్ చేయడానికి వెనుకాడని నాని, మిడ్ రేంజ్ హీరోలతో ప్రాజెక్ట్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నానికి మంచి స్నేహబంధం ఉంది.
అయితే కాన్సెప్ట్ డ్రివెన్ సినిమాలకు అలవాటుపడిన వాల్ పోస్టర్ బ్యానర్ లో కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోలు నటిస్తే బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది అసలైన ప్రశ్న. కేవలం స్టార్డమ్ మాత్రమే కాకుండా కథలోని కాన్సెప్ట్ ని బ్యాలెన్స్ చేస్తూ నాని ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారో చూడాలి. త్వరలోనే ఈ నితిన్ ప్రాజెక్ట్ అండ్ నాని ప్రొడక్షన్ ప్లాన్స్ పై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on August 2, 2026 6:18 pm
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…