ఇటీవల ఆసియా కప్ టీ20 టోర్నీమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తొలి మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయకపోవడంతో మొదలైన గొడవ.. ఫైనల్లో గెలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండా ఇంటికి రావడం వరకు కొనసాగింది. టోర్నీలో పాక్తో తలపడ్డ మూడుసార్లూ విజయం సాధించిన భారత్.. ఆ జట్టుకు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఐతే పాకిస్థాన్ మంత్రి కూడా అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన నఖ్వి చేతుల నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు ససేమిరా అనగా.. ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా ఇప్పించాల్సిన నఖ్వి, పంతం పట్టి ట్రోఫీ ఇవ్వకుండా తన వెంట తీసుకుపోవడం తీవ్ర వివాదాస్పదం అయింద.
దీంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే విజయోత్సవ సంబరాలు చేసుకుంది. వట్టి చేతులతో స్వదేశానికి వచ్చేసింది. కానీ ఈ విషయాన్ని బీసీసీఐ అంత తేలిగ్గా వదిలేస్తుందా? ప్రపంచ క్రికెట్లో భారత బోర్డు సత్తా ఏంటో నఖ్వి సహా అందరికీ తెలుసు. ఆ బలంతో ఇప్పడు నఖ్విని దారికి తీసుకొచ్చింది బీసీసీఐ.
ట్రోఫీ కావాలంటే తన ఆఫీసుకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటూ బిల్డప్ ఇచ్చిన నఖ్వి.. ఇప్పుడు బీసీసీఐ దెబ్బకు తోక ముడిచినట్లు తెలిసిందే. అతను ఆసియా కప్ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు అప్పగించాడు. వాళ్లు ట్రోఫీతో పాటు భారత క్రికెటర్లకు అందాల్సిన విన్నింగ్ మెడల్స్ను కూడా ఇండియాకు పంపిస్తున్నారు. ఇండియా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా కూడా కనిపించడం లేదు. నఖ్వితో సారీ చెప్పించాలని చూస్తోంది.
అంతే కాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి నఖ్విని తప్పించడానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ కౌన్సిల్లో భాగమైన మిగతా దేశాలతో ఈ మేరకు ఒత్తిడి తెప్పిస్తోంది. అంతే కాక ఐసీసీకి కూడా నఖ్వి మీద ఫిర్యాదు చేసింది. ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉన్నది భారతీయుడైన జై షానే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి త్వరలో నఖ్వి ఈ పదవి నుంచి వైదలగితే ఆశ్చర్యమేమీ లేదు. పాకిస్థాన్ అంతర్గత మంత్రి అయిన నఖ్వి.. ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాంటి వ్యక్తి చేతి నుంచి ఆసియా కప్ను అందుకోవడానికి టీమ్ ఇండియా అంగీకరించలేదు.
This post was last modified on October 2, 2025 8:58 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…