Trends

విమాన ప్రమాదంతో మార్కెట్ పై ఎఫెక్ట్

ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. AI171 పేరిట ప్రయాణించిన ఈ విమానంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. 242 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలిసిన వెంటనే మార్కెట్ నెగటివ్ ట్రెండ్‌లోకి వెళ్లింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కుప్పకూలిన వార్తలు పంజా విసురుతుండగా, మదుపరులు డీల్ చేయడంలో వెనుకంజ వేశారు.

అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుండగా, విమాన ప్రమాదం తలనొప్పిని రెట్టింపు చేసింది. ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడికి పాల్పడిన విషయం, అంతేగాక హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకోవచ్చన్న అనుమానాలు మార్కెట్ వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మారేశాయి. చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతం పెరగడంతో, ఆయిల్ ఆధారిత రంగాల్లో నష్టాలు ఎక్కువయ్యాయి.

నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటల సమయంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు క్షీణించి 80,570 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సైతం 330 పాయింట్ల నష్టంతో 24,553 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. బ్రాడర్ మార్కెట్లు, మిడ్ కాప్, స్మాల్ కాప్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఏవియేషన్, టూరిజం, ఆయిల్ కన్స్యూమింగ్ రంగాల్లో గణనీయమైన నష్టాలు నమోదయ్యాయి.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. బోయింగ్ షేర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 5 శాతం పడిపోవడం గమనార్హం. బోయింగ్ కంపెనీకి చెందిన డ్రీమ్‌లైనర్ వాహనం ఇంత ఘోర ప్రమాదానికి గురి కావడం, కంపెనీ పరంగా మాత్రమే కాదు, ఏవియేషన్ పరిశ్రమపైనా ఒత్తిడిని పెంచే అంశం. ఒక్కసారిగా చెడు వార్తలు వరుసగా రావడం వల్ల పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతున్నారు.

ఈ మూడే సెంటిమెంటును గట్టిగా దెబ్బతీసింది. వచ్చే రోజుల్లో మార్కెట్ రికవరీగా మారాలంటే, ఆంతర్య రాజకీయాలు శాంతించాల్సిన అవసరం ఉంది. నిఫ్టీ 24,500 స్థాయి వద్ద మద్దతు కనిపించవచ్చు. అప్పటిదాకా ఎవరూ పెద్దగా రిస్క్ తీసుకోరని అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విమాన ప్రమాదం, చమురు ధరలు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు అన్నీ కలసి దేశీయ మార్కెట్లపై భయానక ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని నుంచి పూర్తిస్థాయి రికవరీకి సమయం పడే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు.

This post was last modified on June 13, 2025 2:07 pm

Share

Recent Posts

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

2 hours ago

దర్శకుడిని దాచి పెడుతున్న దేవరాయ

ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…

3 hours ago

అర్జున్ రెడ్డిపై వంగది ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ అంటే…?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…

3 hours ago

జైలర్ వస్తున్నాడు… మరి ఆదర్శం మాటేమిటి

అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…

3 hours ago

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

5 hours ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

7 hours ago