Trends

విమాన ప్రమాదంతో మార్కెట్ పై ఎఫెక్ట్

ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. AI171 పేరిట ప్రయాణించిన ఈ విమానంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. 242 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలిసిన వెంటనే మార్కెట్ నెగటివ్ ట్రెండ్‌లోకి వెళ్లింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కుప్పకూలిన వార్తలు పంజా విసురుతుండగా, మదుపరులు డీల్ చేయడంలో వెనుకంజ వేశారు.

అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుండగా, విమాన ప్రమాదం తలనొప్పిని రెట్టింపు చేసింది. ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడికి పాల్పడిన విషయం, అంతేగాక హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకోవచ్చన్న అనుమానాలు మార్కెట్ వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మారేశాయి. చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతం పెరగడంతో, ఆయిల్ ఆధారిత రంగాల్లో నష్టాలు ఎక్కువయ్యాయి.

నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటల సమయంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు క్షీణించి 80,570 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సైతం 330 పాయింట్ల నష్టంతో 24,553 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. బ్రాడర్ మార్కెట్లు, మిడ్ కాప్, స్మాల్ కాప్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఏవియేషన్, టూరిజం, ఆయిల్ కన్స్యూమింగ్ రంగాల్లో గణనీయమైన నష్టాలు నమోదయ్యాయి.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. బోయింగ్ షేర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 5 శాతం పడిపోవడం గమనార్హం. బోయింగ్ కంపెనీకి చెందిన డ్రీమ్‌లైనర్ వాహనం ఇంత ఘోర ప్రమాదానికి గురి కావడం, కంపెనీ పరంగా మాత్రమే కాదు, ఏవియేషన్ పరిశ్రమపైనా ఒత్తిడిని పెంచే అంశం. ఒక్కసారిగా చెడు వార్తలు వరుసగా రావడం వల్ల పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతున్నారు.

ఈ మూడే సెంటిమెంటును గట్టిగా దెబ్బతీసింది. వచ్చే రోజుల్లో మార్కెట్ రికవరీగా మారాలంటే, ఆంతర్య రాజకీయాలు శాంతించాల్సిన అవసరం ఉంది. నిఫ్టీ 24,500 స్థాయి వద్ద మద్దతు కనిపించవచ్చు. అప్పటిదాకా ఎవరూ పెద్దగా రిస్క్ తీసుకోరని అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విమాన ప్రమాదం, చమురు ధరలు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు అన్నీ కలసి దేశీయ మార్కెట్లపై భయానక ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని నుంచి పూర్తిస్థాయి రికవరీకి సమయం పడే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

2 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

2 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

4 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

5 hours ago