రాజధాని అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివా సరావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను చంపేయరాదని వ్యాఖ్యానించడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఏం జరిగింది?
ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జరిగిన ఓ చర్చలో ఎనలిస్టు, సీనియర్జర్నలిస్టు కృష్ణం రాజు.. అమరావతి రాజధాని మహిళలపైతీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో యాంకర్గా ఉన్న కొమ్మి నేని.. ఆయనను నిలువరించకపోగా.. ఆ వ్యాఖ్యల పట్ల “ఔను..ఔను” అంటూ సమర్థించేలా వ్యాఖ్యానించా రు. ఏపీలో సెక్సు వర్కర్లు పెరిగిపోయారంటూ.. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని కృష్ణంరాజు ఉటంకిస్తూ.. అమరావతిలో అంతా వారే ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికి కొమ్మినేని సమర్థించారు.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించారు. సాక్షి కార్యాలయాల ముందు ధర్నా చేశారు. దీనికి తోడు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా కృష్ణంరాజు, ఏ2గా కొమ్మినేని, ఏ3గా సాక్షి యాజమాన్యా న్నిపేర్కొంది. ఈ క్రమంలో ఏ1, ఏ2లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతంకొమ్మినేని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే.. ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూనే కీలక వ్యాఖ్యలుచేసింది. “నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటాం. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి” అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on June 13, 2025 1:18 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…