ఇండియాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంగా.. నిన్నటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ను చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. కేవలం నిమిషంలోపే జనావాసాల మధ్య కుప్పకూలిపోవడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండడం గమనార్హం.
ఈ విషాదం చాలదన్నట్లు విమానం కూలిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ హాస్టల్లో సైతం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రయాణం అంటే అనేక జాగ్రత్తలు చేసుకుంటారు. విమానానికి సంబంధించి ప్రతిదీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు. అలాంటిది కనీసం నిమిషం ప్రయాణం కూడా పూర్తి కాకముందే రెండు ఇంజిన్లూ పని చేయకుండా పోయి విమానం కుప్పకూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని పలు థియరీలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే దేశంలో ఒక పెద్ద ప్లేన్ క్రాష్ జరగబోతోందని ఒక జ్యోతిష్యురాలు సోషల్ మీడియాలో ఒకటికి రెండుసార్లు పోస్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ‘ఆస్ట్రో షర్మిష్ట’ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో గత ఏడాది డిసెంబరు 24న ఒక పోస్టు పెట్టారు. అందులో కొత్త ఏడాదిలో విమానయాన రంగం పురోగతి సాధిస్తుందని చెబుతూనే.. ఒక ప్లేన్ క్రాష్ హెడ్ లైన్స్గా మారి పెద్ద షాకిస్తుందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా సరిగ్గా వారం కిందట కొన్ని ప్రెడిక్షన్స్ చెబుతూ.. మరోసారి ప్లేన్ క్రాష్ గురించి ప్రస్తావించారు.
ఇప్పుడు అహ్మదాబాద్ విషాదంతో ఆ రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఒకటికి రెండుసార్లు విమాన ప్రమాదం గురించి నొక్కి వక్కాణించడంతో.. ఇదేం దిక్కుమాలిన ప్రెడిక్షన్ అంటూ ఓవైపు ఆ జ్యోతిషురాలిపై విరుచుకుపడుతూ.. ముందే ఆమె ఇలా ఎలా చెప్పగలిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదం మీద విచారణలో భాగంగా ఈ జ్యోతిషురాలి మీద కూడా ఓ కన్నేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు..
This post was last modified on June 13, 2025 2:02 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…