వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని అభిమానులు భావించినప్పటికీ టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన కాసేపటికే బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం శుభ సూచకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వరుణ్ గత డిజాస్టర్లు మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేశాయి. కొన్నింటికి సరైన ఓపెనింగ్ రాలేదు. సాయంత్రం షోకే డెఫిసిట్లు వేసిన మట్కా లాంటి వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇలాంటి టైంలో కొరియన్ కనకరాజు తనకు ఆక్సీజెన్ లా పని చేయాల్సిందే. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చిన ప్రమోషన్లు క్రమంగా బజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న బుకింగ్స్ వరుణ్ తేజ్ ఇమేజ్ తో కాకుండా, పబ్లిసిటీలో చూపించిన శాంపిల్స్ వల్ల ఆడియన్స్ దృష్టి దీని మీద పడేలా చేసింది. రెగ్యులర్ హారర్ డ్రామా తరహాలో వెళ్లకుండా రాయలసీమ కుర్రాడిలో కొరియన్ ఆత్మ ప్రవేశించడమనే వెరైటీ పాయింట్ తీసుకోవడం ఆడియన్స్ ని దీని వైపు తిప్పుతోంది.
రేపు అర్ధరాత్రి ఎలాంటి టాక్ వస్తుందనే దాని గురించి టీమ్ మొత్తం సస్పెన్స్ తో ఎదురు చూస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు నెక్స్ట్ డే మార్నింగ్ షో నుంచే బుకింగ్స్ ఊపందుకుంటాయి. ముఖ్యంగా కౌంటర్ సేల్స్ బిసి సెంటర్స్ లో బాగుంటాయి. ఎలాగూ చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న డిసికి జీరో బజ్ ఉంది. ఏదో అద్భుతం అనిపించే టాక్ వస్తే తప్ప తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓపెన్ కాదు.
దివంగత దర్శకుడు కేకే చివరి సినిమా కెజెక్యూ కూడా రేసులో ఉంది కానీ అది పూర్తి ఇంటెన్స్ డ్రామా కావడం వల్ల పోటీ పరంగా టెన్షన్ పడేందుకు లేదు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినా కొరియన్ కనకరాజుదే పై చేయి అవుతుంది కనక రెండో స్థానంలో కెజెక్యూ సెట్ అవుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కొరియన్ కనకరాజుతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు. తిరిగి స్టార్ హీరోలతో జట్టు కట్టాలంటే దీంతో ప్రూవ్ చేసుకోవాలి. మాటల్లో ఆ నమ్మకమైతే కనిపిస్తోంది.
This post was last modified on August 5, 2026 11:12 pm
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…