టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని వల్ల సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రమాదంలో పడింది. వాటి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఐతే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ రేటు తక్కువ అని సింగిల్ స్క్రీన్లకే వెళ్తున్నారు. దీనికి తోడు సింగిల్ స్క్రీన్లను రెనొవేట్ చేసి మల్టీప్లెక్స్కు దగ్గరగా ఉండే విజువల్, సౌండ్ క్వాలిటీ ఇచ్చే ప్రయత్నమూ జరుగుతోంది. ఇలా కొంత మేర సింగిల్ స్క్రీన్లు మనగలుగుతున్నాయి.
కానీ ఇప్పుడు వాటి మనుగడనూ ప్రమాదంలోకి నెట్టేలా మల్టీప్లెక్స్ జెయింట్ పీవీఆర్ ఒక సంచలన అడుగు వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 300 కొత్త స్క్రీన్లను అందుబాటులోకి తేబోతోందట. తక్కువ సైజుతో, మెయింటైనెన్స్ తక్కువ ఉండేలా ఆ స్క్రీన్లను నిర్మించనుందట. అన్నింటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. ఈ స్క్రీన్లలో టికెట్ ధర తక్కువ ఉంటుందట.
175 రూపాయల ఫ్లాట్ టికెట్ రేటుతో ఈ 300 స్క్రీన్లను అందుబాటులోకి తేనుందట పీవీఆర్. ప్రస్తుతం తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.295గా ఉంది. ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ రేటు రూ.177. కొన్ని ప్రీమియం మల్టీప్లెక్సుల్లో కాస్త రేటు ఎక్కువగా ఉంటోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఎక్కువ రేట్లున్న రాష్ట్రాలూ ఉన్నాయి. ఐతే దేశంలోని అన్ని మేజర్ సిటీస్లోనూ పీవీఆర్ జనతా స్క్రీన్లు రాబోతున్నాయి. ఈ మూడొందల స్క్రీన్లలోనూ ఫ్లాట్ రూ.175 రేటే ఉండబోతోంది.
రీజనబుల్ రేటుతో మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇది సింగిల్ స్క్రీన్ల మనుగడను సవాలు చేస్తుందనడంలో సందేహం లేదు. త్వరలోనే వీటి నిర్మాణం మొదలుపెట్టి వీలైనంత త్వరగా ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని పీవీఆర్ చూస్తోంది. టికెట్ల ధరలతో పాటు పాప్ కార్న్, స్నాక్స్ ధరలు కూడా రీజనబుల్గా ఉండేలా చూసుకుంటే ఈ స్క్రీన్లు సూపర్ హిట్ కావడం ఖాయం.
This post was last modified on August 5, 2026 11:25 pm
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…