ఇవాళ కొత్త శుక్రవారం థియేటర్ రిలీజులు చప్పగా ఉన్నాయి కానీ ఓటిటి ద్వారా ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేసేందుకు బోలెడు ఆప్షన్స్ వచ్చేశాయి. మాములుగా ఇంత మూకుమ్మడి కంటెంట్ ఒకేసారి రావడం అరుదు. వీటిలో బ్లాక్ బస్టర్స్ లేకపోయినా ఆడియన్స్ లో అంతో ఇంతో ఆసక్తి రేపినవి చాలా ఉన్నాయి. నవీన్ చంద్ర ‘ఎలెవన్’కు రిలీజ్ టైంలో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓటిటి కోసం మూవీ లవర్స్ ఎదురు చూశారు. అది ఈ రోజు నెరవేరింది. తనదే మరో క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ స్పాట్’ కూడా వరసగా చూసేయొచ్చు. ఈ రెండూ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చాయి.
ఇదే ప్లాట్ ఫార్మ్ లో వచ్చిన మరో మూవీ ‘ఏస్’. విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనరిది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో హీరోయిన్ గా చేస్తున్న రుక్మిణి వసంత్ కథానాయకిగా నటించింది. ఇది తమిళ తెలుగు భాషల్లో డిజాస్టరే కానీ ఓటిటి స్పందన బాగుండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. నిన్నటి నుంచే సోని లివ్ లో ‘అలప్పుజ జింఖానా’ స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని యువత బాగానే చూశారు. సమంతా నిర్మించిన ‘శుభం’ని హాట్ స్టార్ లో పెట్టేశారు. అక్షయ్ కుమార్ – మాధవన్ ఇంటరెస్టింగ్ కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రియులు భారీగా ఉన్నారు. దీంట్లోనే చూసేయొచ్చు.
ఇక వెంకటేష్ – రానా కలయికలో రూపొందిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు 2’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. మొదటి భాగంలో విమర్శలు తెచ్చిన బూతులు, బోల్డ్ కంటెంట్ తగ్గించేశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు కాబట్టి ఈసారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్న వెంకీ అభిమానులు ఈసారి ప్రత్యేకంగా రానా నాయుడు 2ని చూస్తారు. ఇక్కడ ప్రస్తావించినవి మెయిన్ కంటెంట్లే. వివిధ భాషల్లో వచ్చిన కొత్త ఓటిటి రిలీజులు చాలానే ఉన్నాయి. సో థియేటర్ కు వెళ్లే అవకాశం రాలేదని చింత లేకుండా నెట్టింట్లో ఇంత వినోదం దొరికితే ఇక చింత ఏలా.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…