టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇంకో బ్యాడ్ ఫ్రైడే వచ్చేసింది. మాములుగా థియేటర్ల దగ్గర జనంతో సందడిగా కనిపించాల్సిన వాతావరణం అసలు గేట్లైనా తెరుస్తారో లేదోని అనుమాన పడేలా చాలా సెంటర్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ విడుదలవుతున్న కొత్త సినిమాలు కట్టప్ప జడ్జ్ మెంట్, హంటర్, పాపా దేనికీ కనీస స్థాయిలో బజ్ లేదు. ఈ మూడు తమిళ డబ్బింగ్ బాపతే. ఏదో నాలుగు డబ్బులు వస్తాయని నిర్మాతలు ట్రై చేస్తున్నారు. పాపా గత ఏడాది ఆల్రెడీ ఒకసారి రిలీజ్ ట్రై చేసి విఫలమయ్యింది. నిజం అని ఇంకో స్ట్రెయిట్ మూవీ ఉంది కానీ దాంట్లో క్యాస్టింగ్ ఎవరో కూడా ప్రేక్షకులకు అవగాహన లేదు.
వీటి సంగతి ఇలా ఉండగా ఈసారి కూడా రీ రిలీజుల సందడే ఎక్కువ కనిపిస్తోంది. అనూహ్యంగా అందాల రాక్షసి బుకింగ్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువ శాతం షోలు అడ్వాన్స్ లోనే ఫుల్ అవుతున్నాయి. నోటెడ్ హీరోలు లేకపోయినా సరే రధన్ పాటలు, ప్రేమని కొత్త ఎమోషన్ తో చూపించిన హను రాఘవపూడి దర్శకత్వం యూత్ ని లాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మళ్ళీ వస్తున్నా ఫ్యాన్స్ ఆసక్తిగానే ఉన్నారు. హరిహర వీరమల్లు వాయిదా పడిన గాయాన్ని మర్చిపోవడానికి దీన్నో మార్గంగా ఎంచుకుంటున్నారు. రవితేజ వెంకీ సైతం మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సో ఇంకో వారం రోజులు ఎగ్జిబిటర్లు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. జూన్ 20 కుబేర రిలీజ్ అయ్యే దాకా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. థియేటర్ల బంద్ ఎవరూ చేయకపోయినా సరైన సినిమాలు ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీనే ఒక రకంగా ఇన్ డైరెక్ట్ బంద్ చేయించినట్టు అయ్యింది. షోలు వేయడానికి థియేటర్లు సిద్ధంగా ఉన్నా, సిబ్బంది ఎదురు చూస్తున్నా అసలు జనం వచ్చేలా చేయడానికి ఏ సినిమా లేకపోవడమే ఇలాంటి దుస్థితికి కారణం. కుబేర తర్వాత వారానికి కన్నప్ప వస్తుంది కాబట్టి వీటికి కనక హిట్ టాక్ వస్తే మళ్ళీ థియేటర్లోలో ఆడియన్స్ నిండుగా ఉన్న సీన్లను చూడొచ్చు.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…