PM at the inauguration of various ISRO projects at Vikram Sarabhai Space centre (VSSC) in Thiruvananthapuram, Kerala on February 27, 2024.
సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి మన దేశం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే అరుదైన అవకాశం వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దక్కింది. వచ్చే నెలలో జరగనున్న ఈ అంతరిక్ష ప్రయాణాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రైవేట్ వ్యోమ ప్రయాణం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు నాసా, యాక్సియమ్ స్పేస్ సహకారంతో జరగనుంది.
శుభాన్షు శుక్లా గత ఎనిమిది నెలలుగా అమెరికాలోని నాసా, యాక్సియమ్ స్పేస్ సంస్థల్లో కఠిన శిక్షణ పొందుతున్నారు. ‘యాక్సియమ్-4’ పేరుతో నిర్వహించే ఈ వ్యోమ ప్రయాణంలో ఆయనను పైలట్గా ఎంపిక చేశారు. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం దాదాపు 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్లకు పైగా) భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రయాణానికి మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ బృందంలో ఉన్న మరో ఇద్దరు సభ్యులు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి (పోలండ్), టిబోర్ కపు (హంగేరి) మిషన్ స్పెషలిస్టులుగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణానికి ఎంపికైన శుభాన్షు శుక్లా ఇప్పటివరకు ఉన్న భారత వ్యోమగాముల్లో అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆయన వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు.
1984లో భారతదేశం నుంచి మొదటిసారి రాకేష్ శర్మ సోయుజ్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత మళ్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా నిలవడం విశేషం. ఈ ప్రయాణం కేవలం చారిత్రాత్మకంగానే కాకుండా, మనదేశానికి వ్యూహాత్మకంగా కూడా ఎంతో విలువైనది. దీనివల్ల త్వరలో ఇస్రో చేపట్టబోతున్న మానవ సహిత ‘గగన్యాన్’ మిషన్కు అవసరమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మన దేశం కక్ష్యలో ఉపగ్రహ ప్రయోగాల్లో సత్తా చాటింది. ఇప్పుడు మన దేశ వ్యోమగాములు కూడా అంతరిక్షంలోకి వెళ్లే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. శుభాన్షు శుక్లా జరపబోయే ప్రయాణంతో మన అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గగన్యాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లకు ఈ ప్రయాణం కీలక అనుభవంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
This post was last modified on April 18, 2025 11:42 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…