Trends

40 ఏళ్ల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి భారత వ్యోమగామి

సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి మన దేశం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లే అరుదైన అవకాశం వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దక్కింది. వచ్చే నెలలో జరగనున్న ఈ అంతరిక్ష ప్రయాణాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రైవేట్ వ్యోమ ప్రయాణం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు నాసా, యాక్సియమ్ స్పేస్ సహకారంతో జరగనుంది.

శుభాన్షు శుక్లా గత ఎనిమిది నెలలుగా అమెరికాలోని నాసా, యాక్సియమ్ స్పేస్ సంస్థల్లో కఠిన శిక్షణ పొందుతున్నారు. ‘యాక్సియమ్-4’ పేరుతో నిర్వహించే ఈ వ్యోమ ప్రయాణంలో ఆయనను పైలట్‌గా ఎంపిక చేశారు. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం దాదాపు 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్లకు పైగా) భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రయాణానికి మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ బృందంలో ఉన్న మరో ఇద్దరు సభ్యులు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి (పోలండ్), టిబోర్ కపు (హంగేరి) మిషన్ స్పెషలిస్టులుగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణానికి ఎంపికైన శుభాన్షు శుక్లా ఇప్పటివరకు ఉన్న భారత వ్యోమగాముల్లో అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆయన వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు.

1984లో భారతదేశం నుంచి మొదటిసారి రాకేష్ శర్మ సోయుజ్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత మళ్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా నిలవడం విశేషం. ఈ ప్రయాణం కేవలం చారిత్రాత్మకంగానే కాకుండా, మనదేశానికి వ్యూహాత్మకంగా కూడా ఎంతో విలువైనది. దీనివల్ల త్వరలో ఇస్రో చేపట్టబోతున్న మానవ సహిత ‘గగన్‌యాన్’ మిషన్‌కు అవసరమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మన దేశం కక్ష్యలో ఉపగ్రహ ప్రయోగాల్లో సత్తా చాటింది. ఇప్పుడు మన దేశ వ్యోమగాములు కూడా అంతరిక్షంలోకి వెళ్లే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. శుభాన్షు శుక్లా జరపబోయే ప్రయాణంతో మన అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లకు ఈ ప్రయాణం కీలక అనుభవంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Kumar

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

2 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

5 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago