అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్. ఐతే చాలా ఏళ్ల నుంచి ఆయనకు సరైన విజయాలు లేవు. దీంతో దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. దీనికి తోడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల విషయంలో అతడికి తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఈ మధ్య తాను బాలీవుడ్కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఐతే తన గురించి బాలీవుడ్ మీడియాలో నెగెటివ్ వార్తలు రావడం.. సోషల్ మీడియాలోనూ నెగెటివ్ ప్రచారం జరగడం మామూలే. ఇలాంటి ప్రచారం మీదే ఇప్పుడు అనురాగ్ ఘాటుగా స్పందించాడు.
తాను సినిమాల్లేకుండా ఖాళీ అయిపోయానని ఒక వర్గం ప్రచారం చేస్తోందంటూ అతను మండిపడ్డాడు. తాను షారుఖ్ కంటే బిజీ అని.. రోజుకు మూడు సినిమాలు రిజెక్ట్ చేసే స్థాయిలో ఉన్నానని అనురాగ్ ట్వీట్ చేయడం విశేషం. నేను సినిమాలు వదిలేశాను అనుకున్న వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ చెబుతున్నా. నేను ఇక్కడే ఉన్నాను. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను (అలా కచ్చితంగా ఉండాలి, కానీ అతనంత డబ్బు మాత్రం సంపాదించను).
2028 వరకు నా డేట్స్ ఖాళీ లేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది మొదట్లో రెండు విడుదల కావచ్చు. నాకు సుదీర్ఘమైన ఐఎండీబీ ఉంది, రోజుకు మూడు ప్రాజెక్ట్లకు నో చెప్పేంత బిజీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ పని మీరు చూసుకోండి” అంటూ కొన్ని బూతులు కూడా జోడించి తన విమర్శకులకు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. కొన్నేళ్లుగా అనురాగ్ నటుడిగానే ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళంలో మహారాజ, లియో సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా మహారాజలో అనురాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. డకాయిట్ మూవీతో తెలుగు సినిమా డెబ్యూ చేయనున్నాడు.
This post was last modified on April 19, 2025 5:14 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…