అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్. ఐతే చాలా ఏళ్ల నుంచి ఆయనకు సరైన విజయాలు లేవు. దీంతో దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. దీనికి తోడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల విషయంలో అతడికి తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఈ మధ్య తాను బాలీవుడ్కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఐతే తన గురించి బాలీవుడ్ మీడియాలో నెగెటివ్ వార్తలు రావడం.. సోషల్ మీడియాలోనూ నెగెటివ్ ప్రచారం జరగడం మామూలే. ఇలాంటి ప్రచారం మీదే ఇప్పుడు అనురాగ్ ఘాటుగా స్పందించాడు.
తాను సినిమాల్లేకుండా ఖాళీ అయిపోయానని ఒక వర్గం ప్రచారం చేస్తోందంటూ అతను మండిపడ్డాడు. తాను షారుఖ్ కంటే బిజీ అని.. రోజుకు మూడు సినిమాలు రిజెక్ట్ చేసే స్థాయిలో ఉన్నానని అనురాగ్ ట్వీట్ చేయడం విశేషం. నేను సినిమాలు వదిలేశాను అనుకున్న వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ చెబుతున్నా. నేను ఇక్కడే ఉన్నాను. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను (అలా కచ్చితంగా ఉండాలి, కానీ అతనంత డబ్బు మాత్రం సంపాదించను).
2028 వరకు నా డేట్స్ ఖాళీ లేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది మొదట్లో రెండు విడుదల కావచ్చు. నాకు సుదీర్ఘమైన ఐఎండీబీ ఉంది, రోజుకు మూడు ప్రాజెక్ట్లకు నో చెప్పేంత బిజీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ పని మీరు చూసుకోండి” అంటూ కొన్ని బూతులు కూడా జోడించి తన విమర్శకులకు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. కొన్నేళ్లుగా అనురాగ్ నటుడిగానే ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళంలో మహారాజ, లియో సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా మహారాజలో అనురాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. డకాయిట్ మూవీతో తెలుగు సినిమా డెబ్యూ చేయనున్నాడు.
This post was last modified on April 19, 2025 5:14 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…