Trends

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టై అయితే.. జరిగేదిదే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు సిద్ధమయ్యాయి. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని చూస్తుండగా, న్యూజిలాండ్‌ 2000 తర్వాత తమ రెండో టైటిల్‌ను అందుకోవాలని సిద్ధమవుతోంది.. అయితే ఈ మ్యాచ్ టై అయితే ఎవరికి కప్పు దక్కుతుంది? 2019 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టుకు జరిగిన అన్యాయాన్ని మళ్లీ చూడాల్సి వస్తుందా? అనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠలో ముంచేస్తోంది.

ఈసారి టై జరిగితే 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా ఐసీసీ కొత్త నిబంధనలను అమలు చేసింది. మ్యాచ్ టై అయితే, తక్షణమే సూపర్ ఓవర్ జరిపి విజేతను నిర్ణయిస్తారు. కానీ, సూపర్ ఓవర్ కూడా టై అయితే? 2019 ప్రపంచ కప్‌లో కేవలం బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించినా, ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా వరుసగా సూపర్ ఓవర్లు జరిపి విజేతను ఖరారు చేసే విధానం అమలులోకి వచ్చింది. అంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టై అయితే ఎన్ని సూపర్ ఓవర్లు అయినా కొనసాగుతాయి, విజేత తేలే వరకూ మ్యాచ్ ఆగదన్నమాట.

మరోవైపు వర్షం వల్ల మ్యాచ్ పూర్తి కాకపోతే..

ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతున్నా, పాకిస్థాన్ వేదికగా మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా నష్టపోయాయి. అయితే ఫైనల్‌కు వర్షం అంతగా ప్రభావం చూపే అవకాశం తక్కువ. అయినప్పటికీ, వర్షం కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించలేకపోతే, భారత్, న్యూజిలాండ్‌ జట్లు కలిసి ట్రోఫీని పంచుకుంటాయి. 2002లో శ్రీలంక, భారత్ ఫైనల్ కూడా ఇదే తరహాలో ముగిసిన విషయం తెలిసిందే.

ఇక భారత్ జట్టు ఈ టోర్నీలో ఇప్పటి వరకు తమ ఆటతీరుతో అద్భుతమైన ప్రదర్శన చూపించింది. వరుసగా మ్యాచ్‌లు గెలిచి దూసుకెళ్తున్న భారత బౌలర్లు, న్యూజిలాండ్‌ను మరోసారి కట్టడి చేయాలనుకుంటున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీసి రాణించగా, ఫైనల్‌లోనూ అతని స్పిన్ కీలకంగా మారనుంది. న్యూజిలాండ్ జట్టు కూడా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించడంతో, ఈ మ్యాచ్‌లో సమగ్ర ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డెరిల్ మిచెల్ వంటి బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కొనడం ఎలా అనేదే కీలకం. వర్షం కలుగజేసుకోవడమో, లేదంటే మ్యాచ్ టై అవ్వడమో జరిగినా, ఈ ఫైనల్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.

This post was last modified on March 7, 2025 2:56 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

6 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago