మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో సినిమా అంటే ఏ దర్శకుడైనా తొందరరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తాడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం తన స్టయిల్ లో ఎలాంటి మార్పు ఉండదని ఎప్పటికప్పుడు తన చేతల ద్వారా చూపిస్తూనే ఉంటాడు. ఒక్కసారి టార్గెట్ లాక్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని అందుకునే తీరాలని కసితో పరుగులు పెడతాడు. సంక్రాంతికి వస్తున్నాం ఆ వేగం కారణంగానే పండగ సినిమాల్లో ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్న మూవీగా రికార్డు సృష్టించింది. పోటీలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ ని తోసిరాజని విజేతగా నిలిచింది. ఇదే ఫార్ములాని మెగాస్టార్ కు వాడబోతున్నాడు అనిల్.
తనకు ఏకధాటిగా 90 రోజుల డేట్లు ఇమ్మని రావిపూడి చేసిన విన్నపానికి మెగాస్టార్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందట. ప్రస్తుతం వైజాగ్ లో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మే నెలకల్లా ఫైనల్ వెర్షన్ రెడీ చేయాలి. ఆలోగా విశ్వంభర తాలూకు పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి కాబట్టి చిరంజీవి అందుబాటులోకి వచ్చేస్తారు. జూన్ లేదా జూలై నుంచి మొదలుపెట్టినా నవంబర్ కాంతా గుమ్మడికాయ కొట్టి, 2026 సంక్రాంతి బరిలో ఉండేలా ప్రతి షెడ్యూల్ ని పక్కా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసుకున్నారట. భీమ్స్ తో సహా దాదాపు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ నే రిపీట్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్న కథ వినోద ప్రధానంగా ఉందే తప్ప విఎఫ్ఎక్స్, ఫారిన్ లొకేషన్స్ డిమాండ్ చేసేలా ఉండదట. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయిని మిక్స్ చేసి వింటేజ్ చిరంజీవిని బయటికి తీసేలా అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే తీసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. భీమ్స్ పాటల కంపోజింగ్ దాదాపు అయిపోవచ్చిందని సమాచారం. ఆడియో విన్న చిరు ఇంప్రెస్స్ అయ్యారట. కొరియోగ్రఫీ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. ఇంతకీ హీరోయిన్లు ఎవరనే లీక్ బయటికి రాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ డేట్లు దొరికాకే వాటిని కన్ఫర్మ్ చేస్తారట.
This post was last modified on March 7, 2025 11:02 am
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…