భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తూ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రాణా, మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. అయితే, అతను గాయపడిన శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడంపై ఇంగ్లండ్ మాజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్పు ఐసీసీ నిబంధనలకు విరుద్ధమా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కంకషన్ సబ్స్టిట్యూట్ నిబంధనల ప్రకారం, గాయపడిన ఆటగాడి స్థానంలో అతనితో సమానమైన పాత్రలో ఉండే ఆటగాడినే తీసుకోవాలి. కానీ, శివమ్ దూబే ఒక ఆల్రౌండర్ కాగా, అతడి స్థానంలో శుద్ధమైన పేస్ బౌలర్ అయిన హర్షిత్ రాణాను తీసుకోవడంపై ఇంగ్లండ్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. జట్టు ఎంపికపై స్పష్టత లేకపోవడంతో, కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డ్ అంపైర్లతో చర్చించినప్పటికీ, ఎలాంటి మార్పులు జరగలేదు.
మ్యాచ్ తర్వాత బట్లర్ దీనిపై ఘాటుగా స్పందించాడు. “ఇది సరైన నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు హర్షిత్ ఫీల్డింగ్లో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించాను. కానీ, టీమిండియా కంకషన్ సబ్స్టిట్యూట్ అని సమాధానం ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పినా, దీనిపై మరింత స్పష్టత అవసరమని మేము అభిప్రాయపడుతున్నాం” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడికి గాయమైతే, అతడి స్థానంలో సమాన స్థాయిలో ఆడగలిగే ఆటగాడినే తీసుకోవాలి. బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలర్ లేదా ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్ను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టంగా ఉంది. అయితే, ఒకసారి మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రత్యర్థి జట్టు ఆ పై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. ఇంగ్లండ్ మాత్రం ఈ అంశంపై మళ్లీ ఐసీసీ రూల్స్ను పరిశీలించాలని కోరుతోంది.
ఈ వివాదంతో టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. హర్షిత్ రాణా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి, మ్యాచ్ను భారత్కు అందించినప్పటికీ, ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ దీని పై అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తుందా? లేక ఇది కేవలం ఇంగ్లండ్ అసంతృప్తిగా మిగిలిపోతుందా? అనేది చూడాల్సి ఉంది.
This post was last modified on February 1, 2025 2:11 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…