ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ ఊ అంటూ కాపీ రైట్ కేసులు పడిపోతున్నాయి. ఒరిజినల్ క్రియేటర్స్ మనోభావాలు కూడా దెబ్బ తింటున్నాయి. అనుమతులు అడగాలి. డబ్బులు కట్టాలి. ముఖ్యంగా ఇళయరాజా కేసుల పుణ్యమా అని భారీగా ఖర్చు పెట్టి మరీ పాత పాటల రైట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ఆ పాటల జోలికే వెళ్లడం మానేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాలో హిందీ పాట నాచే నాచేను రీమిక్స్ చేయడం కోసం కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇళయరాజా పాటలను జస్ట్ అలా బ్యాగ్రౌండ్లో వాడినా సరే ఆయన ఊరుకోవట్లేదు. చాలా సినిమాల మేకర్స్ ముందే డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకున్నారు. లేదంటే తర్వాత కేసుల పుణ్యమా అని జరిమానాలు కట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పాత పాటలు చాలానే వాడుకున్న నేపథ్యంలో నిర్మాతలు వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పవన్ సినిమానే అయిన తొలిప్రేమ నుంచి ఈ మనస్సే పాటను పూర్తిగా ఉస్తాద్ కోసం వాడేశారు. పాత పాటను పెట్టేసి కొత్త విజువల్స్ జోడించారు. ఈ పాట బీజీఎంను సైతం కొన్ని చోట్ల వాడారు. మరోవైపు రుద్రవీణలోని ఇళయరాజా పాట తరలిరాద తనే వసంతంను కూడా సినిమా కోసం వాడుకున్నారు. ఇక నాటు నాటు.. కుర్చీ మడతపెట్టి.. ఇలా పలు పాటలతో ఒక మెడ్లీ లాంటి ఎపిసోడ్ కూడా ఉంది ఇందులో.
మరి ఇన్ని పాటలు వాడినపుడు ఆయా చిత్రాల మేకర్స్ నుంచి అనుమతులు తీసుకున్నారా.. డబ్బులు కట్టారా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా తన పాటను అనుమతి లేకుండా, డబ్బులు కట్టకుండా వాడుకుంటే ఇళయరాజా ఊరుకుంటారా అన్నది డౌటు. మైత్రీ సంస్థే నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన పాటను వాడారాని చాలా సీరియస్ అయి నోటీసులు పంపారు ఇళయరాజా.
ఐతే ఇటీవల కోర్టులో ఈ కాపీ రైట్ వివాదానికి సంబంధించి ఆయనకూ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి ఆయన దూకుడు తగ్గించి ఉండొచ్చు. అయినా సరే మైత్రీ సంస్థకు ఇంతకుముందు ఎదురైన అనుభవం దృష్ట్యా ముందు వెనుక ఆలోచించకుండా ఈ పాటను వాడుకుని ఉండరు.
This post was last modified on March 19, 2026 8:29 pm
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…
ప్రేమలు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా..…