ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ ఊ అంటూ కాపీ రైట్ కేసులు పడిపోతున్నాయి. ఒరిజినల్ క్రియేటర్స్ మనోభావాలు కూడా దెబ్బ తింటున్నాయి. అనుమతులు అడగాలి. డబ్బులు కట్టాలి. ముఖ్యంగా ఇళయరాజా కేసుల పుణ్యమా అని భారీగా ఖర్చు పెట్టి మరీ పాత పాటల రైట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ఆ పాటల జోలికే వెళ్లడం మానేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాలో హిందీ పాట నాచే నాచేను రీమిక్స్ చేయడం కోసం కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇళయరాజా పాటలను జస్ట్ అలా బ్యాగ్రౌండ్లో వాడినా సరే ఆయన ఊరుకోవట్లేదు. చాలా సినిమాల మేకర్స్ ముందే డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకున్నారు. లేదంటే తర్వాత కేసుల పుణ్యమా అని జరిమానాలు కట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పాత పాటలు చాలానే వాడుకున్న నేపథ్యంలో నిర్మాతలు వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పవన్ సినిమానే అయిన తొలిప్రేమ నుంచి ఈ మనస్సే పాటను పూర్తిగా ఉస్తాద్ కోసం వాడేశారు. పాత పాటను పెట్టేసి కొత్త విజువల్స్ జోడించారు. ఈ పాట బీజీఎంను సైతం కొన్ని చోట్ల వాడారు. మరోవైపు రుద్రవీణలోని ఇళయరాజా పాట తరలిరాద తనే వసంతంను కూడా సినిమా కోసం వాడుకున్నారు. ఇక నాటు నాటు.. కుర్చీ మడతపెట్టి.. ఇలా పలు పాటలతో ఒక మెడ్లీ లాంటి ఎపిసోడ్ కూడా ఉంది ఇందులో.
మరి ఇన్ని పాటలు వాడినపుడు ఆయా చిత్రాల మేకర్స్ నుంచి అనుమతులు తీసుకున్నారా.. డబ్బులు కట్టారా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా తన పాటను అనుమతి లేకుండా, డబ్బులు కట్టకుండా వాడుకుంటే ఇళయరాజా ఊరుకుంటారా అన్నది డౌటు. మైత్రీ సంస్థే నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన పాటను వాడారాని చాలా సీరియస్ అయి నోటీసులు పంపారు ఇళయరాజా.
ఐతే ఇటీవల కోర్టులో ఈ కాపీ రైట్ వివాదానికి సంబంధించి ఆయనకూ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి ఆయన దూకుడు తగ్గించి ఉండొచ్చు. అయినా సరే మైత్రీ సంస్థకు ఇంతకుముందు ఎదురైన అనుభవం దృష్ట్యా ముందు వెనుక ఆలోచించకుండా ఈ పాటను వాడుకుని ఉండరు.
This post was last modified on March 19, 2026 8:29 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…