ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ ఊ అంటూ కాపీ రైట్ కేసులు పడిపోతున్నాయి. ఒరిజినల్ క్రియేటర్స్ మనోభావాలు కూడా దెబ్బ తింటున్నాయి. అనుమతులు అడగాలి. డబ్బులు కట్టాలి. ముఖ్యంగా ఇళయరాజా కేసుల పుణ్యమా అని భారీగా ఖర్చు పెట్టి మరీ పాత పాటల రైట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ఆ పాటల జోలికే వెళ్లడం మానేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాలో హిందీ పాట నాచే నాచేను రీమిక్స్ చేయడం కోసం కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇళయరాజా పాటలను జస్ట్ అలా బ్యాగ్రౌండ్లో వాడినా సరే ఆయన ఊరుకోవట్లేదు. చాలా సినిమాల మేకర్స్ ముందే డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకున్నారు. లేదంటే తర్వాత కేసుల పుణ్యమా అని జరిమానాలు కట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పాత పాటలు చాలానే వాడుకున్న నేపథ్యంలో నిర్మాతలు వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పవన్ సినిమానే అయిన తొలిప్రేమ నుంచి ఈ మనస్సే పాటను పూర్తిగా ఉస్తాద్ కోసం వాడేశారు. పాత పాటను పెట్టేసి కొత్త విజువల్స్ జోడించారు. ఈ పాట బీజీఎంను సైతం కొన్ని చోట్ల వాడారు. మరోవైపు రుద్రవీణలోని ఇళయరాజా పాట తరలిరాద తనే వసంతంను కూడా సినిమా కోసం వాడుకున్నారు. ఇక నాటు నాటు.. కుర్చీ మడతపెట్టి.. ఇలా పలు పాటలతో ఒక మెడ్లీ లాంటి ఎపిసోడ్ కూడా ఉంది ఇందులో.
మరి ఇన్ని పాటలు వాడినపుడు ఆయా చిత్రాల మేకర్స్ నుంచి అనుమతులు తీసుకున్నారా.. డబ్బులు కట్టారా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా తన పాటను అనుమతి లేకుండా, డబ్బులు కట్టకుండా వాడుకుంటే ఇళయరాజా ఊరుకుంటారా అన్నది డౌటు. మైత్రీ సంస్థే నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన పాటను వాడారాని చాలా సీరియస్ అయి నోటీసులు పంపారు ఇళయరాజా.
ఐతే ఇటీవల కోర్టులో ఈ కాపీ రైట్ వివాదానికి సంబంధించి ఆయనకూ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి ఆయన దూకుడు తగ్గించి ఉండొచ్చు. అయినా సరే మైత్రీ సంస్థకు ఇంతకుముందు ఎదురైన అనుభవం దృష్ట్యా ముందు వెనుక ఆలోచించకుండా ఈ పాటను వాడుకుని ఉండరు.
This post was last modified on March 19, 2026 8:29 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…