ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం కాదు. ఉగాది సందర్భంగా పంచాగ కర్త చెప్పిన మాటలివి. ఉగాది వేడుకలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు పండితులు, సిద్దాంతులతో పంచాంగ శ్రవణం చదివించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. భాస్కరభట్ల సిద్దాంతి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పంచాగకర్త ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలతో వివాదాల కారణంగా కూటమి నాయకులు ప్రజల్లో అపకీర్తి తెచ్చుకుంటారని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వారు మరింత బలవంతులవుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, మంత్రులు శాఖలు మారతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చన్నారు. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పొగడ్తలు గుప్పించడం విశేషం. అది సుస్థిరమైన పాలనను ఇస్తుందన్నారు. విశేషమైన కీర్తిని కూడా పొందగలుగుతుందని తెలిపారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చని చెప్పడమే ఇక్కడ గమనార్హం.
This post was last modified on March 19, 2026 5:02 pm
రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…