ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం కాదు. ఉగాది సందర్భంగా పంచాగ కర్త చెప్పిన మాటలివి. ఉగాది వేడుకలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు పండితులు, సిద్దాంతులతో పంచాంగ శ్రవణం చదివించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. భాస్కరభట్ల సిద్దాంతి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పంచాగకర్త ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలతో వివాదాల కారణంగా కూటమి నాయకులు ప్రజల్లో అపకీర్తి తెచ్చుకుంటారని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వారు మరింత బలవంతులవుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, మంత్రులు శాఖలు మారతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చన్నారు. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పొగడ్తలు గుప్పించడం విశేషం. అది సుస్థిరమైన పాలనను ఇస్తుందన్నారు. విశేషమైన కీర్తిని కూడా పొందగలుగుతుందని తెలిపారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చని చెప్పడమే ఇక్కడ గమనార్హం.
This post was last modified on March 19, 2026 5:02 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…