Political News

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ళ్లీ రేగిన మంట‌లు.. దీక్ష‌ల‌కు రెడీ!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య రేగిన వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు వ్యాఖ్య‌లు చేసుకోవ‌డంతోపాటు.. పోటా పోటీ కార్య‌క్ర‌మాలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌దానా కార్యాల‌యంపై జ‌రిగిన దాడి ద‌రిమిలా.. చోటు చేసుకున్న ప‌రిణామాల్లో ఇటు టీడీపీ నాయ‌కులు.. అటు వైసీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు కొన‌సాగించారు. అరెయ్‌.. అంటే అరెయ్‌! అంటూ.. నాయ‌కులు దూష‌ణ‌ల …

Read More »

డ్రాగన్ సైన్యంపై త్రిశూలం

India-China

చైనా-భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం చేస్తున్న కంపు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఏదో కారణంగా మన భూభాగంలోకి చొచ్చుకు రావడం మన సైన్యం తో గొడవ పడటం మామూలైపోయింది. కొన్నిసార్లు ఈ గొడవలు శృతిమించి ముష్టిఘాతాలు, ముళ్ళ కర్రలతో కొట్టుకోవడం వరకు వెళిపోతోంది. ఆమధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఇలాంటి ఘటనలోనే రెండువైపుల సైనికులు చనిపోయిన విషయం మనదేశంలో సంచలనంగా మారింది. గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు కావాలనే …

Read More »

లోకేష్ శ‌ప‌థం: వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ వారం జ‌రిగిన టీడీపీ కార్యాల‌యంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీతో స‌హా తాము చెల్లిస్తామ‌ని.. దేశం లో ఎక్క‌డ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వ‌దిలిపెట్టేది లేద‌ని.. స్ప‌ష్టం చేశారు. త‌మ ఓర్పు స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారని అన్న …

Read More »

కాంగ్రెస్ కు కెప్టెన్ షాక్

మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తొందరలోనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలో తొందరలో జరగబోతున్న సమయంలో కెప్టెన్ సొంత పార్టీ పెట్టే విషయాన్ని ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచటం లేదు. తనను అవమానకరమైన రీతిలో ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసిన కాంగ్రెస్ అధిష్టానం మీద కెప్టెన్ మండిపోతున్నారు. అలాగే తన నిష్క్రమణకు కారణమైన పీసీసీ ప్రెసిడెంట్ నవ్ …

Read More »

వైసీపీ.. తప్పు మీద తప్పు

ఆర్నెల్ల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో తర్వాతి ఎన్నికల్లో విజయం ఎవరిది అని అడిగితే.. వైసీపీదే అని ధీమాగా చెప్పే పరిస్థితి ఉండేది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న జనాల్లో జగన్ సర్కారు పట్ల సానుకూలతే ఉందని.. కాబట్టి మరో పర్యాయం జగన్‌కు ఢోకా లేదనే అంటుండేవాళ్లు రాజకీయ విశ్లేషకులు. కానీ గత ఆరు నెలల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయన్నది విశ్లేషకుల …

Read More »

ప్రియాంక ఫార్ములా సక్సెస్ అవుతుందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జనాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయించబోతున్నట్లు ప్రియాంక ప్రకటించారు. ఇపుడు చేసిన ప్రకటనను కనుక ప్రియాంక ఆచరణలో చూపించినట్లయితే సత్ఫలితాలు ఉంటాయనే అనుకోవాలి. ఎందుకంటే మొత్తం సీట్లలో 40 శాతం ఆడ వాళ్ళకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు. …

Read More »

36 గంట‌ల పాటు చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. ఆయ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఏకంగా 36 గంట‌ల పాటు చంద్ర‌బాబు దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. నిజానికి ఇలాంటి దీక్ష‌, ఇంత‌సేపు చేయ‌డం.. చంద్ర‌బాబు రాజకీయ జీవితంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు దాడుల‌కు …

Read More »

జాతీయ స్థాయిలో క‌ద‌లిక తెచ్చిన చంద్ర‌బాబు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు. పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని .. ఆయ‌న జాతీయ స్థాయికి తీసుకువెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వ పాల‌క పార్టీ ఆమ్ ఆద్మీ స్పందించింది. వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద.. వైసీపీ జరిపిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ రియాక్ట్ అవుతూ.. ఈ ఘ‌ట‌న‌ల‌ను …

Read More »

నారా లోకేష్ స‌హా న‌లుగురిపై మ‌ర్డ‌ర్ కేస్‌.. ఏం జ‌రిగింది!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌హా.. న‌లుగురు కీల‌క నేత‌ల‌పై గుంటూరు జిల్లా పోలీసులు.. హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేశారు. అంతేకాదు.. ఏ1గా నారాలోకేష్‌ను, ఏ2గా ఎమ్మెల్సీ ప‌రుచూరు అశోక్‌బాబును, ఏ3గా మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను, ఏ4గా ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ను చేర్చారు. అంతేకాదు.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా న‌మోదు చేశారు. అదేంటి.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు దాడుల‌కు …

Read More »

నన్ను తిడితే అభిమానులకు బీపీ వస్తుంది-జగన్

మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఇవి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పనే అన్నది స్పష్టం. టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుకు ప్రతిస్పందనగానే ఈ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఐతే ఈ దాడులతో తమకేం …

Read More »

టీడీపీ బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత

ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతల, కార్యాలయాలపై మంగళవారం జరిగిన దాడులకు నిరసనగా ఆ పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో టీడీపీ నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాల్లో టీడీపీ నాయకులను తెల్లవారుజాము …

Read More »

జగన్ పాలన చూస్తే జాలేస్తోంది – ఐవైఆర్‌

చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, త‌ద‌నంత‌రం.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన మాజీ ఐఏఎస్‌.. అధికారి ఐవైఆర్ కృష్ణారావు.. తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేస్తోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న త‌ర‌చుగా ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణ‌రావు.. పార్టీ జెండా ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి రాక‌పోయినా.. మైకు పుచ్చుకుని మాత్రం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు …

Read More »