కూటమి దెబ్బకు కుదేలైన వైసీపీ

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధాటికి అధికార వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్‌ చేసేలా కనిపిస్తోంది.

మంత్రులలో ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల రాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్‌, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, విడుదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఉష శ్రీ చరణ్‌ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల, తూర్పు గోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల, కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల , ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10, శ్రీకాకుళంలో 10కి 9, విశాఖ పట్నంలో 15కి 13, విజయ నగరంలో 9కి 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 175 శాసనసభ స్తానాలలో టీడీపీ 130, జనసేన 20, వైసీపీ 18, బీజేపీ 7 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 25 లోక్ సభ స్థానాలలో 21 స్థానాలలో కూటమి అభ్యర్థులు, 4 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.