జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచుతున్నారు. మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. 14వ తేదీన మొదలయ్యే పర్యటనలో మొదట భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పైనాలుగు నియోజకవర్గాల్లో కూడా అచ్చంగా బహిరంగసభలనే కాకుండా పార్టీ ముఖ్యులు, సమాజంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు, ప్రభావశీలురతో భేటీ అవబోతున్నారు. అలాగే పార్టీలోని వీరమహిళలు, వార్డు స్ధాయిలో పనిచేసే నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జనాలతో మమేకం అవటం కోసం బహిరంగసభల్లో పాల్గొంటారు.
మొత్తంమీద పవన్ దృష్టంతా ఉభయగోదావరి జిల్లాల మీదే కేంద్రీకృమైన విషయం తెలిసిందే. ఎందుకంటే టీడీపీతో పొత్తులో తీసుకోబోతున్న సీట్లలో కూడా ఎక్కువ భాగం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉండబోతోంది. రెండు జిల్లాల్లోని 34 సీట్లలో జనసేనకు 12 సీట్లను అడుగుతున్నారు. పొత్తులో జనసేనకు దక్కుతుందని అనుకుంటున్న 25 సీట్లలో 12 సీట్లు గోదావరి జిల్లాల్లోనే కావాలని పవన్ అడుగుతున్నారంటేనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది.
పనిలోపనిగా పవన్ పోటీచేస్తారని ప్రచారంలో ఉన్న భీమవరం, కాకినాడ నియోజకవర్గాల్లో కూడా గట్టి దృష్టిపెట్టారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిన చోటే గెలవాలన్నది పవన్ పట్టుదలగా పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎంఎల్ఏ ద్వారపురెడ్డి చంద్రశేఖరరెడ్డికి పవన్ కు ఏమాత్రం పడదు. ఒక్కళ్ళని మరొకళ్ళు అమ్మనాబూతులు తిట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.
పైగా భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, కాకినాడలో ద్వారపురెడ్డి పదేపదే పవన్ తమ నియోజకవర్గాల్లో పోటీచేయమని చాలెంజులు విసురుతున్నారు. మరి పవన్ పోటీచేస్తారో లేదో తెలీదు కాని పై రెండు నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టయితే పెట్టింది వాస్తవం. అందుకనే పార్టీలో కూడా పై రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. మరి పవన్ నిజంగానే పై నియోజకవర్గాల్లో పోటీచేస్తారా ? లేకపోతే మిత్రపక్షాల అభ్యర్ధులు రంగంలోకి దిగుతారా అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 11, 2024 10:51 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…