Political News

జోరు పెంచబోతున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచుతున్నారు. మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. 14వ తేదీన మొదలయ్యే పర్యటనలో మొదట భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పైనాలుగు నియోజకవర్గాల్లో కూడా అచ్చంగా బహిరంగసభలనే కాకుండా పార్టీ ముఖ్యులు, సమాజంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు, ప్రభావశీలురతో భేటీ అవబోతున్నారు. అలాగే పార్టీలోని వీరమహిళలు, వార్డు స్ధాయిలో పనిచేసే నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జనాలతో మమేకం అవటం కోసం బహిరంగసభల్లో పాల్గొంటారు.

మొత్తంమీద పవన్ దృష్టంతా ఉభయగోదావరి జిల్లాల మీదే కేంద్రీకృమైన విషయం తెలిసిందే. ఎందుకంటే టీడీపీతో పొత్తులో తీసుకోబోతున్న సీట్లలో కూడా ఎక్కువ భాగం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉండబోతోంది. రెండు జిల్లాల్లోని 34 సీట్లలో జనసేనకు 12 సీట్లను అడుగుతున్నారు. పొత్తులో జనసేనకు దక్కుతుందని అనుకుంటున్న 25 సీట్లలో 12 సీట్లు గోదావరి జిల్లాల్లోనే కావాలని పవన్ అడుగుతున్నారంటేనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది.

పనిలోపనిగా పవన్ పోటీచేస్తారని ప్రచారంలో ఉన్న భీమవరం, కాకినాడ నియోజకవర్గాల్లో కూడా గట్టి దృష్టిపెట్టారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిన చోటే గెలవాలన్నది పవన్ పట్టుదలగా పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎంఎల్ఏ ద్వారపురెడ్డి చంద్రశేఖరరెడ్డికి పవన్ కు ఏమాత్రం పడదు. ఒక్కళ్ళని మరొకళ్ళు అమ్మనాబూతులు తిట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

పైగా భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, కాకినాడలో ద్వారపురెడ్డి పదేపదే పవన్ తమ నియోజకవర్గాల్లో పోటీచేయమని చాలెంజులు విసురుతున్నారు. మరి పవన్ పోటీచేస్తారో లేదో తెలీదు కాని పై రెండు నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టయితే పెట్టింది వాస్తవం. అందుకనే పార్టీలో కూడా పై రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. మరి పవన్ నిజంగానే పై నియోజకవర్గాల్లో పోటీచేస్తారా ? లేకపోతే మిత్రపక్షాల అభ్యర్ధులు రంగంలోకి దిగుతారా అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on February 11, 2024 10:51 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

19 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

21 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago