Political News

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటిదాకా పెద్దగా నోరు విప్పని పవన్ కల్యాణ్… మంగళవారం మాత్రం ఈ దిశగా వస్తున్న ఆరోపణలపై ఓ రేంజిలో వివరణ ఇచ్చి అందరి నోళ్లను మూయించారని చెప్పక తప్పదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు నిరసనగా తాను అన్నిరోజుల పాటు అన్నం తినలేదని తాజాగా పవన్ చెప్పారు.

2014లో పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సందర్శంగా అన్ని రోజుల పాటు తాను అన్నం ఎందుకు తినలేదన్న విషయాన్ని ఆయన నాడు చెప్పలేదు. దీంతో ఆ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని పవన్ ను తెలంగాణ వ్యతిరేకిగా చూపే యత్నం జరిగింది.

ఇక మంగళవారం నాటి జనసేన నవ నిర్మాణ సంకల్ప సభను వ్యతిరేకించిన సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నాటి పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఒప్పుకోని పవన్ కు తెలంగాణతో ఏం పని అని వాదించిన సంగతి తెలిసిందే.

నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి దక్కని నేపథ్యంలో హైదరాబాద్ లోని తన ఇంటి వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్…తెలంగాణ పట్ల తన మనసులో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడించారు.

తాను 11 రోజుల పాటు అన్నం తిననది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందుకు కాదన్న పవన్.. రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిన తీరుకు నిరసనగా అన్నం తినలేదని చెప్పారు. ఈ విషయంపై ఎవరేమనుకున్నా కూడా తనకు పెద్దగా పట్టింపేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on June 2, 2026 9:21 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

7 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago