జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటిదాకా పెద్దగా నోరు విప్పని పవన్ కల్యాణ్… మంగళవారం మాత్రం ఈ దిశగా వస్తున్న ఆరోపణలపై ఓ రేంజిలో వివరణ ఇచ్చి అందరి నోళ్లను మూయించారని చెప్పక తప్పదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు నిరసనగా తాను అన్నిరోజుల పాటు అన్నం తినలేదని తాజాగా పవన్ చెప్పారు.
2014లో పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సందర్శంగా అన్ని రోజుల పాటు తాను అన్నం ఎందుకు తినలేదన్న విషయాన్ని ఆయన నాడు చెప్పలేదు. దీంతో ఆ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని పవన్ ను తెలంగాణ వ్యతిరేకిగా చూపే యత్నం జరిగింది.
ఇక మంగళవారం నాటి జనసేన నవ నిర్మాణ సంకల్ప సభను వ్యతిరేకించిన సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నాటి పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఒప్పుకోని పవన్ కు తెలంగాణతో ఏం పని అని వాదించిన సంగతి తెలిసిందే.
నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి దక్కని నేపథ్యంలో హైదరాబాద్ లోని తన ఇంటి వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్…తెలంగాణ పట్ల తన మనసులో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడించారు.
తాను 11 రోజుల పాటు అన్నం తిననది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందుకు కాదన్న పవన్.. రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిన తీరుకు నిరసనగా అన్నం తినలేదని చెప్పారు. ఈ విషయంపై ఎవరేమనుకున్నా కూడా తనకు పెద్దగా పట్టింపేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on June 2, 2026 9:21 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…