ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన రెగ్యులర్ రేట్లతోనే రిలీజ్ అయ్యేది. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడడం ద్వారా ఎక్కువ ఆదాయం రాబట్టుకునేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమాలకు లాంగ్ రన్ లేని నేపథ్యంలో, టికెట్ల రేట్లు పెంచుకుని తొలి వీకెండ్లోనే వీలైనంత వెనక్కి రాబట్టుకోవాలని ఇటు నిర్మాతలు, అటు బయ్యర్లు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకు ఆంధ్రప్రదేశ్లో సులువుగానే అనుమతులు వచ్చేస్తున్నాయి కానీ.. తెలంగాణలో మాత్రం రేట్ల పెంపు సాధ్యపడట్లేదు. గత ఏడాది సెలక్టివ్గా కొన్ని సినిమాలకు రేట్లు ఇచ్చినా.. ఈ ఏడాది మళ్లీ కథ మారింది. ప్రభాస్ సినిమా ది రాజాసాబ్కు చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పలేదు.
రిలీజ్ ముందు రోజు మిడ్ నైట్ వరకు జీవో రాకపోవడంతో అప్పటి వరకు బుకింగ్సే ఓపెన్ కాలేదు. చివరికి నార్మల్ రేట్లతోనే సినిమాను రిలీజ్ చేసుకున్నారు. ముందే బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం వల్ల ఎంత ఆదాయం కోల్పోయారో అంచనా కూడా వేయలేని పరిస్థితి. అది పది కోట్లకు తక్కువగా ఉండే అవకాశం లేదు.
కానీ తర్వాత చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారుకు రేట్ల పెంపు జీవో ముందే రావడంతో బుకింగ్స్ సాఫీగా సాగాయి. ఆ సినిమాకు బాగా ప్రయోజనం పొందింది. కానీ సంక్రాంతి తర్వాత మళ్లీ రేట్ల పెంపు విషయంలో పీటముడి బిగుసుకుంది. సమ్మర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్కు రేట్లు పెంచుకోవడానికి చూశారు. కానీ ఫలితం లేకపోయింది.
జీవో కోసం చూసి చూసి ఆలస్యంగా నార్మల్ రేట్లతో బుకింగ్స్ మొదలుపెట్టారు. దీని వల్ల సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడింది. ఈ అనుభవాలు కళ్ల ముందు ఉండగానే.. పెద్ది సినిమాకు కూడా తెలంగాణలో రేట్ల పెంపుకోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏపీలో రిలీజ్కు నాలుగైదు రోజుల ముందే అనుమతులు వచ్చాయి. మూడు రోజుల ముందే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అక్కడంతా సాఫీగా సాగిపోతోంది.
కానీ తెలంగాణలో మాత్రం వెయిటింగ్ గేమ్ కొనసాగుతోంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ పడాల్సి ఉండగా.. 24 గంటల ముందు కూడా టికెట్ల రేట్లు పెంపు జీవో రాలేదు. పెంపు మీద ఆశలు పెట్టుకోకుండా నార్మల్ రేట్లతో టికెట్ల అమ్మకాలు మూడు రోజుల ముందే మొదలుపెట్టి ఉంటే.. ఈపాటికి సేల్స్ ఒక రేంజిలో ఉండేవి.
ఈ ఎదురు చూపుల వల్ల బుకింగ్స్లో విపరీతమైన ఆలస్యం జరిగి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.ఈ దశలో రేట్ల పెంపు ఉన్నా ప్రయోజనం ఏమాత్రం ఉంటుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ రేట్ల పెంపే లేకపోతే మాత్రం కోల్పోయే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటుందనే అంచనాలున్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…