కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టే దాకా తను పడిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు లాంటి కీలకమైన మార్కెట్లు కూడా ఈ సందర్భంగా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంతగా అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు చెప్పిన దాని కన్నా డబుల్ రేట్లు వచ్చేంతగా.
జై భీమ్ రూపంలో సూర్యకు ఒక మర్చిపోలేని క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు టీజె జ్ఞానవేల్. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో వెట్టయన్ చేశారు కానీ ఆది ఆశించిన ఫలితం అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. సామజిక సమస్యకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని చూసిన జ్ఞానవేల్ రజనిని హ్యాండిల్ చేయడంలో తడబడ్డారు. దీంతో పరాజయం తప్పలేదు. ఇక మళ్ళీ సూర్యతో చేయి కలిపిన జ్ఞానవేల్ ఒక విభిన్నమైన బయోపిక్ ఎంచుకున్నారని సమాచారం.
చెన్నైకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరువేంగడం పేదల పాలిట పెన్నిధిగా పేరొందారు. కన్సల్టింగ్ ఫీజుగా వందల రూపాయలు వసూలు చేసే ఆసుపత్రులకు భిన్నంగా ఈయన తన దగ్గరికి వచ్చే వారి నుంచి కేవలం 2 లేదా 5 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. పూర్తి పేరు కృష్ణ వరదాచారి తిరువేంగడం. ఛాతీ వ్యాధుల నిపుణుడుగా గొప్ప పేరు సంపాదించారు. ఈ డాక్టర్ అత్యున్నత జ్ఞానానికి అందరూ వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్ అని పిలిచేవారు.
ఎన్నో విశిష్ట సేవలు అందించిన తిరువేంగడంను ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 94 సంవత్సరాల వయసులో ఆరేళ్ళ క్రితం అనారోగ్యంతో ఈ లెజెండరీ వైద్యులు కన్ను మూశారు. తన జీవన ప్రయాణంలో ఈయన చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, విజయాలు అన్నీ దర్శకుడు జ్ఞానవేల్ చూపించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది. సో సూర్యని మరో స్పెషల్ రోల్ చూడబోతున్నామన్న మాట.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…