కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టే దాకా తను పడిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు లాంటి కీలకమైన మార్కెట్లు కూడా ఈ సందర్భంగా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంతగా అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు చెప్పిన దాని కన్నా డబుల్ రేట్లు వచ్చేంతగా.
జై భీమ్ రూపంలో సూర్యకు ఒక మర్చిపోలేని క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు టీజె జ్ఞానవేల్. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో వెట్టయన్ చేశారు కానీ ఆది ఆశించిన ఫలితం అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. సామజిక సమస్యకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని చూసిన జ్ఞానవేల్ రజనిని హ్యాండిల్ చేయడంలో తడబడ్డారు. దీంతో పరాజయం తప్పలేదు. ఇక మళ్ళీ సూర్యతో చేయి కలిపిన జ్ఞానవేల్ ఒక విభిన్నమైన బయోపిక్ ఎంచుకున్నారని సమాచారం.
చెన్నైకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరువేంగడం పేదల పాలిట పెన్నిధిగా పేరొందారు. కన్సల్టింగ్ ఫీజుగా వందల రూపాయలు వసూలు చేసే ఆసుపత్రులకు భిన్నంగా ఈయన తన దగ్గరికి వచ్చే వారి నుంచి కేవలం 2 లేదా 5 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. పూర్తి పేరు కృష్ణ వరదాచారి తిరువేంగడం. ఛాతీ వ్యాధుల నిపుణుడుగా గొప్ప పేరు సంపాదించారు. ఈ డాక్టర్ అత్యున్నత జ్ఞానానికి అందరూ వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్ అని పిలిచేవారు.
ఎన్నో విశిష్ట సేవలు అందించిన తిరువేంగడంను ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 94 సంవత్సరాల వయసులో ఆరేళ్ళ క్రితం అనారోగ్యంతో ఈ లెజెండరీ వైద్యులు కన్ను మూశారు. తన జీవన ప్రయాణంలో ఈయన చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, విజయాలు అన్నీ దర్శకుడు జ్ఞానవేల్ చూపించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది. సో సూర్యని మరో స్పెషల్ రోల్ చూడబోతున్నామన్న మాట.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…