Political News

టికెట్ కోసం ఓ ఎంపీ జగన్ కు 12 కోట్లు ఇచ్చారు: రఘురామ

సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తన టికెట్ కోసం జగన్ రెడ్డికి ఓ ఎంపీ 12 కోట్లు ఇచ్చారని రఘురామ షాకింగ్ ఆరోపణలు చేశారు. అతితెలివితో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీకి కష్టాలు తెచ్చి పెట్టారని, ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 600 కోట్లు వస్తే టిడిపికి 27 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక, మరో 10 వేల కోట్ల అప్పు కోసం నిర్మలా సీతారామన్ తో జగన్ రెడ్డి భేటీ అయ్యారని ఆరోపించారు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఏపీలో డబ్బులు లేవని అన్నారు. అయితే, అక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులకు మాత్రం జీతాలు సకాలంలో పడ్డాయని ఆరోపించారు. విద్యార్థులకు ప్రశ్నా పత్రాలు ప్రింట్ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఆరోపించారు. ఇతర పార్టీలలో సీఎం అభ్యర్థిని వైసీపీ నేతలు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉంటుందో లేదో వైసీపీకి అనవసరమని చెప్పారు. ఇక, లోకేష్ పిలుపునిచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కృష్ణా జలాల పున: పంపిణీ వ్యవహారంపై కేంద్రానికి జగన్ లేఖ రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలు పంపిణీ అంశం పరిశీలన చేయాలన్న నిర్ణయం పై జగన్ అభ్యంతరం తెలిపారని అన్నారు. కానీ, జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటాతో ఏపీకి నష్టం ఎక్కువ అని అన్నారు. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలు వృథా కాకుండా టిడిపి అధినేత చంద్రబాబు గతంలో చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు కేంద్రంపై జగన్ పోరాటం చేయాలని రఘురామ సూచించారు.

This post was last modified on October 7, 2023 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రదీప్ రంగనాథన్ రికార్డు… కష్టమేనా?

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను.. తమిళ యంగ్ హీరో ప్రదీప్…

19 minutes ago

పెళ్లి ఆగిపోతే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారు.. కానీ మందాన మాత్రం..

సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…

1 hour ago

‘వైసీపీ తలా తోకా లేని పార్టీ’

తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…

2 hours ago

మహేష్ బాబును మరిచిపోతే ఎలా?

టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…

3 hours ago

చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి

తెలంగాణ రాష్ట్రాన్ని వ‌చ్చే 2047 నాటికి 3(30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు) ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా…

3 hours ago

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

4 hours ago