ఓటిటి టాక్ షోలు ఎందరు నిర్వహించినా అన్ స్టాపబుల్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దేనికీ రాలేదన్నది వాస్తవం. రెండు సీజన్లు బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్నాయి. సినిమా కెమెరా ముందు తప్ప బయట తడబడతారని పేరున్న బాలయ్య ఈ ప్రోగ్రాంని నడిపించిన తీరు ఆహాకు పెద్ద మైలేజ్ తీసుకొచ్చింది . కొత్త సినిమాల కన్నా మెరుగ్గా వ్యూస్, రెవెన్యూస్ వచ్చి పడ్డాయి. అయితే బాలయ్య రాజకీయ అవసరాలతో పాటు షూటింగుల పరంగా బిజీగా ఉండటంతో ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అన్ స్టాపబుల్ 3 పరిమిత ఎపిసోడ్లను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
గెస్టులు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆప్త మిత్రుల కలయిక చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ ఈసారి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువేనట. ఆ మేరకు అల్లు అరవింద్ తన బావని ఒప్పించినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. గోపిచంద్, అడవి శేష్, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్లందరూ ఆల్రెడీ పూర్తయ్యారు కాబట్టి ఈసారి రిపిటీషన్ లేకుండా కొత్త ఆకర్షణలు తీసుకొచ్చేనందుకు ఆహ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ ని లాక్ చేసినట్టు వినికిడి.
సాధ్యమైన మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టిలను తీసుకొచ్చేందుకు అన్ని రకరాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు సాధ్యమైతే వాళ్ళతో చకచకా షూటింగ్ చేసేస్తారు. భగవంత్ కేసరి రిలీజయ్యాక బాలయ్యకు కాస్త ఫ్రీ టైం దొరుకుంది. ఆ తర్వాత దర్శకుడు బాబీ సినిమా మొదలుపెట్టాలి. ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కువ భాగాలకు ఛాన్స్ ఉండదు. లిమిటెడ్ అన్నారు కాబట్టి పైన చెప్పినట్టుగా చాలా స్పెషల్ గెస్టులే రావడం కన్ఫర్మ్.
This post was last modified on October 7, 2023 8:27 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…