ఓటిటి టాక్ షోలు ఎందరు నిర్వహించినా అన్ స్టాపబుల్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దేనికీ రాలేదన్నది వాస్తవం. రెండు సీజన్లు బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్నాయి. సినిమా కెమెరా ముందు తప్ప బయట తడబడతారని పేరున్న బాలయ్య ఈ ప్రోగ్రాంని నడిపించిన తీరు ఆహాకు పెద్ద మైలేజ్ తీసుకొచ్చింది . కొత్త సినిమాల కన్నా మెరుగ్గా వ్యూస్, రెవెన్యూస్ వచ్చి పడ్డాయి. అయితే బాలయ్య రాజకీయ అవసరాలతో పాటు షూటింగుల పరంగా బిజీగా ఉండటంతో ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అన్ స్టాపబుల్ 3 పరిమిత ఎపిసోడ్లను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
గెస్టులు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆప్త మిత్రుల కలయిక చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ ఈసారి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువేనట. ఆ మేరకు అల్లు అరవింద్ తన బావని ఒప్పించినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. గోపిచంద్, అడవి శేష్, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్లందరూ ఆల్రెడీ పూర్తయ్యారు కాబట్టి ఈసారి రిపిటీషన్ లేకుండా కొత్త ఆకర్షణలు తీసుకొచ్చేనందుకు ఆహ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ ని లాక్ చేసినట్టు వినికిడి.
సాధ్యమైన మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టిలను తీసుకొచ్చేందుకు అన్ని రకరాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు సాధ్యమైతే వాళ్ళతో చకచకా షూటింగ్ చేసేస్తారు. భగవంత్ కేసరి రిలీజయ్యాక బాలయ్యకు కాస్త ఫ్రీ టైం దొరుకుంది. ఆ తర్వాత దర్శకుడు బాబీ సినిమా మొదలుపెట్టాలి. ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కువ భాగాలకు ఛాన్స్ ఉండదు. లిమిటెడ్ అన్నారు కాబట్టి పైన చెప్పినట్టుగా చాలా స్పెషల్ గెస్టులే రావడం కన్ఫర్మ్.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…