ఓటిటి టాక్ షోలు ఎందరు నిర్వహించినా అన్ స్టాపబుల్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దేనికీ రాలేదన్నది వాస్తవం. రెండు సీజన్లు బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్నాయి. సినిమా కెమెరా ముందు తప్ప బయట తడబడతారని పేరున్న బాలయ్య ఈ ప్రోగ్రాంని నడిపించిన తీరు ఆహాకు పెద్ద మైలేజ్ తీసుకొచ్చింది . కొత్త సినిమాల కన్నా మెరుగ్గా వ్యూస్, రెవెన్యూస్ వచ్చి పడ్డాయి. అయితే బాలయ్య రాజకీయ అవసరాలతో పాటు షూటింగుల పరంగా బిజీగా ఉండటంతో ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అన్ స్టాపబుల్ 3 పరిమిత ఎపిసోడ్లను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
గెస్టులు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆప్త మిత్రుల కలయిక చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ ఈసారి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువేనట. ఆ మేరకు అల్లు అరవింద్ తన బావని ఒప్పించినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. గోపిచంద్, అడవి శేష్, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్లందరూ ఆల్రెడీ పూర్తయ్యారు కాబట్టి ఈసారి రిపిటీషన్ లేకుండా కొత్త ఆకర్షణలు తీసుకొచ్చేనందుకు ఆహ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ ని లాక్ చేసినట్టు వినికిడి.
సాధ్యమైన మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టిలను తీసుకొచ్చేందుకు అన్ని రకరాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు సాధ్యమైతే వాళ్ళతో చకచకా షూటింగ్ చేసేస్తారు. భగవంత్ కేసరి రిలీజయ్యాక బాలయ్యకు కాస్త ఫ్రీ టైం దొరుకుంది. ఆ తర్వాత దర్శకుడు బాబీ సినిమా మొదలుపెట్టాలి. ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కువ భాగాలకు ఛాన్స్ ఉండదు. లిమిటెడ్ అన్నారు కాబట్టి పైన చెప్పినట్టుగా చాలా స్పెషల్ గెస్టులే రావడం కన్ఫర్మ్.
This post was last modified on October 7, 2023 8:27 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…