ఓటిటి టాక్ షోలు ఎందరు నిర్వహించినా అన్ స్టాపబుల్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దేనికీ రాలేదన్నది వాస్తవం. రెండు సీజన్లు బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్నాయి. సినిమా కెమెరా ముందు తప్ప బయట తడబడతారని పేరున్న బాలయ్య ఈ ప్రోగ్రాంని నడిపించిన తీరు ఆహాకు పెద్ద మైలేజ్ తీసుకొచ్చింది . కొత్త సినిమాల కన్నా మెరుగ్గా వ్యూస్, రెవెన్యూస్ వచ్చి పడ్డాయి. అయితే బాలయ్య రాజకీయ అవసరాలతో పాటు షూటింగుల పరంగా బిజీగా ఉండటంతో ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అన్ స్టాపబుల్ 3 పరిమిత ఎపిసోడ్లను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
గెస్టులు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆప్త మిత్రుల కలయిక చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ ఈసారి సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువేనట. ఆ మేరకు అల్లు అరవింద్ తన బావని ఒప్పించినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. గోపిచంద్, అడవి శేష్, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్లందరూ ఆల్రెడీ పూర్తయ్యారు కాబట్టి ఈసారి రిపిటీషన్ లేకుండా కొత్త ఆకర్షణలు తీసుకొచ్చేనందుకు ఆహ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెగాస్టార్ ని లాక్ చేసినట్టు వినికిడి.
సాధ్యమైన మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టిలను తీసుకొచ్చేందుకు అన్ని రకరాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు సాధ్యమైతే వాళ్ళతో చకచకా షూటింగ్ చేసేస్తారు. భగవంత్ కేసరి రిలీజయ్యాక బాలయ్యకు కాస్త ఫ్రీ టైం దొరుకుంది. ఆ తర్వాత దర్శకుడు బాబీ సినిమా మొదలుపెట్టాలి. ఫిబ్రవరి నుంచి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కువ భాగాలకు ఛాన్స్ ఉండదు. లిమిటెడ్ అన్నారు కాబట్టి పైన చెప్పినట్టుగా చాలా స్పెషల్ గెస్టులే రావడం కన్ఫర్మ్.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…