కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. పలు సంస్థలు ఇప్పటికే క్లినిక్ ట్రయల్స్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశలు పూర్తి అయి.. మూడో దశను చేపట్టారు.
భారత్ విషయానికి వస్తే.. ప్రఖ్యాత భారత్ బయోటెక్ సంస్థ తన కొవాక్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ టీకాకు సంబంధించి కేంద్రం కీలక అనుమతుల్ని జారీ చేసింది. ఇప్పటివరకు కండరాలకు టీకా ఇచ్చే దానికి బదులుగా.. చర్మం కింది పొరల్లో టీకా ఇచ్చే ట్రయల్స్ కు అనుమతిని జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
చికిత్సలో భాగంగా వ్యాక్సిన్ ను పలు విధాలుగా ఇస్తుంటారు. టీకాల్లో అత్యధికం కండరాలకు ఇస్తుంటారు. భుజాలకు.. పిరుదులకు టీకాలు ఇచ్చే పద్దతిని ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. అందుకు భిన్నంగా మరికొన్ని టీకాల్ని నోటి ద్వారా.. నరాల ద్వారా ఇస్తారు. అలానే మరికొన్నింటిని చర్మం కింది పొరకు ఇస్తుంటారు. దీన్ని ఇంట్రాడెర్మల్ రూట్ అంటారు.
కండరాలకు కాకుండా.. చర్మం కింది భాగానికి టీకా ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది. కండరాలకు ఇచ్చే టీకాల్ని అతిక మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చర్మం కింది పొరలకైతే తక్కువ మోతాదు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మందికి టీకాలు ఇచ్చేందుకు ఈ విధానంలో కుదురుతుంది.
భారత్ లాంటి దేశంలో వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఇవ్వాల్సి వస్తే.. తాజాగా అనుమతి పొందిన పద్దతి (చర్మం కింది భాగానికి టీకా ఇవ్వటం)తో తక్కువ ధరకు.. ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ సంస్థ దేశ వ్యాప్తంగా పన్నెండు ఆసుపత్రుల్లో 1125 మంది రోగులపై మొదటి.. రెండో దశ క్లీనికల్ టెస్టుల్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీకా చేసే పద్దతికి సంబంధించి కేంద్రం కీలక అనుమతిని ఇవ్వటం గమనార్హం.
This post was last modified on August 24, 2020 10:25 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…