అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు తెర తీస్తేనే అసలు ఇబ్బంది అంతా.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ ప్యాడ్.. సంతకాల్ని ఫోర్జరీ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు వ్యక్తి ఏమీ చిన్నోడు కాదు. మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడిగా సుపరిచితుడైన సాయి అలియాస్ చింటూ.
సీఎం కేసీఆర్ తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. తన గురించి భారీగా బిల్డప్ లు ఇవ్వటంతో పాటు.. ఉద్యోగాల కోసం ఆశగా తిరిగే యూత్ ను మాయమాటలు చెప్పి.. వారి దగ్గర నుంచి డబ్బులు లాగి మోసం చేసిన ఉదంతాలు బోలెడన్ని అని చెబుతున్నారు.
ఇతగాడిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. మంత్రికి అనుచరుడిగా ఉన్న కారణంగా.. పోలీసులు టైం కోసం ఎదురుచూస్తుండేవారని చెబుతారు. తాజాగా సీఎం లెటర్ హెడ్ ను.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు మంత్రి కేటీఆర్ చాలా సన్నిహితమని చెప్పుకొనేవాడు.
తాజాగా అతన్ని టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటమే కాదు.. అతడి దగ్గర నుంచి నకిలీ లెటర్ హెడ్ ప్యాడ్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడి లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
This post was last modified on August 23, 2020 11:03 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…