అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు తెర తీస్తేనే అసలు ఇబ్బంది అంతా.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ ప్యాడ్.. సంతకాల్ని ఫోర్జరీ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు వ్యక్తి ఏమీ చిన్నోడు కాదు. మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడిగా సుపరిచితుడైన సాయి అలియాస్ చింటూ.
సీఎం కేసీఆర్ తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. తన గురించి భారీగా బిల్డప్ లు ఇవ్వటంతో పాటు.. ఉద్యోగాల కోసం ఆశగా తిరిగే యూత్ ను మాయమాటలు చెప్పి.. వారి దగ్గర నుంచి డబ్బులు లాగి మోసం చేసిన ఉదంతాలు బోలెడన్ని అని చెబుతున్నారు.
ఇతగాడిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. మంత్రికి అనుచరుడిగా ఉన్న కారణంగా.. పోలీసులు టైం కోసం ఎదురుచూస్తుండేవారని చెబుతారు. తాజాగా సీఎం లెటర్ హెడ్ ను.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు మంత్రి కేటీఆర్ చాలా సన్నిహితమని చెప్పుకొనేవాడు.
తాజాగా అతన్ని టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటమే కాదు.. అతడి దగ్గర నుంచి నకిలీ లెటర్ హెడ్ ప్యాడ్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడి లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
This post was last modified on August 23, 2020 11:03 am
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…