అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు తెర తీస్తేనే అసలు ఇబ్బంది అంతా.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ ప్యాడ్.. సంతకాల్ని ఫోర్జరీ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు వ్యక్తి ఏమీ చిన్నోడు కాదు. మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడిగా సుపరిచితుడైన సాయి అలియాస్ చింటూ.
సీఎం కేసీఆర్ తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. తన గురించి భారీగా బిల్డప్ లు ఇవ్వటంతో పాటు.. ఉద్యోగాల కోసం ఆశగా తిరిగే యూత్ ను మాయమాటలు చెప్పి.. వారి దగ్గర నుంచి డబ్బులు లాగి మోసం చేసిన ఉదంతాలు బోలెడన్ని అని చెబుతున్నారు.
ఇతగాడిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. మంత్రికి అనుచరుడిగా ఉన్న కారణంగా.. పోలీసులు టైం కోసం ఎదురుచూస్తుండేవారని చెబుతారు. తాజాగా సీఎం లెటర్ హెడ్ ను.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు మంత్రి కేటీఆర్ చాలా సన్నిహితమని చెప్పుకొనేవాడు.
తాజాగా అతన్ని టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటమే కాదు.. అతడి దగ్గర నుంచి నకిలీ లెటర్ హెడ్ ప్యాడ్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడి లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో.. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
This post was last modified on August 23, 2020 11:03 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…