కరోనా పుణ్యమా అని ఈ ఏడాది సినిమాల షెడ్యూళ్లన్నీ తేడా కొట్టేశాయి. ఐదు నెలలుగా కొత్త సినిమాల విడుదల లేదు. షూటింగ్లూ ఆగిపోయాయి. దీంతో మార్చి ద్వితీయార్ధం నుంచి షెడ్యూల్ ప్రకారం అనుకున్న ఏ సినిమా రిలీజ్ కాలేదు. భవిష్యత్ ప్రాజెక్టులన్నీ కూడా అటు ఇటు అయిపోయాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ స్వాతంత్ర్య దినోత్సవానికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్కు బ్రేక్ పడటం, థియేటర్లు మూతపడి ఉండటంతో ఈ ఏడాది చివరికి కూడా విడుదల చేసే అవకాశం లేకపోయింది. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతారని వార్తలొస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా ఈ సినిమా విడుదలవుతుందేమో అని ఆశపడ్డారు అభిమానులు. కానీ అందుకు అవకాశం లేదని.. శనివారం రిలీజైన మోషన్ పోస్టర్ తేల్చేసింది.
‘ఆచార్య’ను వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్లో ప్రకటించేశారు. దీంతో సంక్రాంతి ఆశలకు తెరపడ్డట్లయింది. వచ్చే వేసవికి అధికారికంగా ఖరారైన తొలి భారీ చిత్రం ఇదే మరి. ఇక మిగతా సినిమాల సంగతి తేలాల్సి ఉంది. ‘ఆచార్య’ సైడ్ అయిపోవడంతో ‘వకీల్ సాబ్’కు లైన్ క్లియరైనట్లే. ఈ పవన్ కళ్యాణ్ సినిమా చిత్రీకరణ కొంచెమే మిగిలుంది. ఒక నెల రోజులు చిత్రీకరిస్తే పనైపోతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి సంక్రాంతికి విడుదల చేయడానికి అవకాశముంది. కానీ ఈ లోపు థియేటర్లు తెరుచుకోవాలి. ఒకప్పట్లా 100 శాతం ఆక్యుపెన్సీతో నడవాలి. అలా అయితే తప్ప ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు. మరోవైపు ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను కూడా వేసవిలోనే విడుదల చేయొచ్చని అంటున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సంగతేంటన్నది అయోమయమే. దాని స్కేల్, మిగిలి ఉన్న చిత్రీకరణ ప్రకారం చూస్తే అది వచ్చే ఏడాది ద్వితీయార్దంలో కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
This post was last modified on August 22, 2020 9:16 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…