Political News

పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలకు పార్టీ నాయకులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఖమ్మంలో సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే ముద్ర పడకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఎవరితో పొత్తులు లేవని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అంటూ మూడు పార్టీలను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు ఓట్లు వేస్తే అవి బీఆర్ఎస్ కే చేరతాయని చెప్పి.. వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు అమిత్ షా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా బీజేపీ తెలంగాణ కీలక నాయకులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నాయకులకు మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో పరిస్థితి, పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుందనే అంచనాలు.. ఇలా తదితర విషయాల గురించి అమిత్ షా పూర్తిగా తెలుసుకున్నారని టాక్.

ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించి.. కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ ప్రణాళికల్లో మునిగిపోయింది. ముఖ్యంగా అమిత్ షా ఎన్నికలు జరిగేంతవరకూ ఇక్కడ పార్టీ అడుగులను వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నారని తెలిసింది. అందుకే ప్రతి పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తానని ఇక్కడి బీజేపీ నాయకులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేద్దామని అమిత్ షా చెప్పినట్లు టాక్. 

Satya

Recent Posts

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

9 minutes ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

1 hour ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago