Political News

పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలకు పార్టీ నాయకులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఖమ్మంలో సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే ముద్ర పడకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఎవరితో పొత్తులు లేవని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అంటూ మూడు పార్టీలను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు ఓట్లు వేస్తే అవి బీఆర్ఎస్ కే చేరతాయని చెప్పి.. వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు అమిత్ షా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా బీజేపీ తెలంగాణ కీలక నాయకులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నాయకులకు మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో పరిస్థితి, పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుందనే అంచనాలు.. ఇలా తదితర విషయాల గురించి అమిత్ షా పూర్తిగా తెలుసుకున్నారని టాక్.

ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించి.. కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ ప్రణాళికల్లో మునిగిపోయింది. ముఖ్యంగా అమిత్ షా ఎన్నికలు జరిగేంతవరకూ ఇక్కడ పార్టీ అడుగులను వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నారని తెలిసింది. అందుకే ప్రతి పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తానని ఇక్కడి బీజేపీ నాయకులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేద్దామని అమిత్ షా చెప్పినట్లు టాక్. 

This post was last modified on August 28, 2023 5:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPTelangana

Recent Posts

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…

26 minutes ago

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…

29 minutes ago

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…

50 minutes ago

అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన దురంధర్ 2

ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…

1 hour ago

కపుల్ ఫ్రెండ్లీ లక్ష్యానికి ప్రభాస్ అండ

ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…

2 hours ago

1000 కోట్లకు తక్కువ కాకుండా బన్నీ అడుగులు

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. 'పుష్ప 2' సినిమాతో ఏకంగా…

2 hours ago