సీనియర్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం , స్పీడ్ గా సినిమాలు చేయడం వంటివి ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే ఈసారి బాలయ్య సినిమా , నాగార్జున సినిమా రెండూ పోటీ పడబోతున్నాయి. అయితే వీరు పోటీ పడుతుంది కొత్త సినిమాలతో కాదు. విషయం లోకి వెళ్తే , ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఈ నేపద్యంలో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. అయితే మరుసటి రోజు అంటే 30 న బాలయ్య నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కానే మన్మధుడు సినిమాను నెల ముందు నుండే ప్రమోట్ చేస్తూ రీ రిలీజ్ అన్న సంగతి జనాలకి రీచ్ చేశారు.
నిజానికి బాలయ్య నటించిన బైరవ ద్వీపం ను రాంగ్ టైమ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏదైనా సందర్భం చూసి ప్రమోట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తే బాగుండేది. ఇప్పుడు మన్మధుడు కి ఉన్న రీచ్ భైరవద్వీపం కి కనిపించడం లేదు. చూడాలి మరి రీ రిలీజ్ లతో బాలయ్య , నాగ్ ఎంత కలెక్ట్ చేస్తారో ? ఎవరు పై చేయి సాదిస్తారో ?
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…