సీనియర్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం , స్పీడ్ గా సినిమాలు చేయడం వంటివి ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే ఈసారి బాలయ్య సినిమా , నాగార్జున సినిమా రెండూ పోటీ పడబోతున్నాయి. అయితే వీరు పోటీ పడుతుంది కొత్త సినిమాలతో కాదు. విషయం లోకి వెళ్తే , ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఈ నేపద్యంలో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. అయితే మరుసటి రోజు అంటే 30 న బాలయ్య నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కానే మన్మధుడు సినిమాను నెల ముందు నుండే ప్రమోట్ చేస్తూ రీ రిలీజ్ అన్న సంగతి జనాలకి రీచ్ చేశారు.
నిజానికి బాలయ్య నటించిన బైరవ ద్వీపం ను రాంగ్ టైమ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏదైనా సందర్భం చూసి ప్రమోట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తే బాగుండేది. ఇప్పుడు మన్మధుడు కి ఉన్న రీచ్ భైరవద్వీపం కి కనిపించడం లేదు. చూడాలి మరి రీ రిలీజ్ లతో బాలయ్య , నాగ్ ఎంత కలెక్ట్ చేస్తారో ? ఎవరు పై చేయి సాదిస్తారో ?
This post was last modified on August 28, 2023 5:21 pm
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…
సినిమాలకు సంబంధించి కొన్ని డేట్లు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడంతా అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి…
గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు.…