సీనియర్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం , స్పీడ్ గా సినిమాలు చేయడం వంటివి ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే ఈసారి బాలయ్య సినిమా , నాగార్జున సినిమా రెండూ పోటీ పడబోతున్నాయి. అయితే వీరు పోటీ పడుతుంది కొత్త సినిమాలతో కాదు. విషయం లోకి వెళ్తే , ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఈ నేపద్యంలో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. అయితే మరుసటి రోజు అంటే 30 న బాలయ్య నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కానే మన్మధుడు సినిమాను నెల ముందు నుండే ప్రమోట్ చేస్తూ రీ రిలీజ్ అన్న సంగతి జనాలకి రీచ్ చేశారు.
నిజానికి బాలయ్య నటించిన బైరవ ద్వీపం ను రాంగ్ టైమ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏదైనా సందర్భం చూసి ప్రమోట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తే బాగుండేది. ఇప్పుడు మన్మధుడు కి ఉన్న రీచ్ భైరవద్వీపం కి కనిపించడం లేదు. చూడాలి మరి రీ రిలీజ్ లతో బాలయ్య , నాగ్ ఎంత కలెక్ట్ చేస్తారో ? ఎవరు పై చేయి సాదిస్తారో ?
This post was last modified on August 28, 2023 5:21 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…