సీనియర్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం , స్పీడ్ గా సినిమాలు చేయడం వంటివి ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే ఈసారి బాలయ్య సినిమా , నాగార్జున సినిమా రెండూ పోటీ పడబోతున్నాయి. అయితే వీరు పోటీ పడుతుంది కొత్త సినిమాలతో కాదు. విషయం లోకి వెళ్తే , ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఈ నేపద్యంలో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. అయితే మరుసటి రోజు అంటే 30 న బాలయ్య నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కానే మన్మధుడు సినిమాను నెల ముందు నుండే ప్రమోట్ చేస్తూ రీ రిలీజ్ అన్న సంగతి జనాలకి రీచ్ చేశారు.
నిజానికి బాలయ్య నటించిన బైరవ ద్వీపం ను రాంగ్ టైమ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏదైనా సందర్భం చూసి ప్రమోట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తే బాగుండేది. ఇప్పుడు మన్మధుడు కి ఉన్న రీచ్ భైరవద్వీపం కి కనిపించడం లేదు. చూడాలి మరి రీ రిలీజ్ లతో బాలయ్య , నాగ్ ఎంత కలెక్ట్ చేస్తారో ? ఎవరు పై చేయి సాదిస్తారో ?
This post was last modified on August 28, 2023 5:21 pm
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…