సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ చేసిన సందర్భంగా ఈయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అత్యంత నిజాయితీపరుడిగా, సమర్థవంతమైన అధికారిగా వివి లక్ష్మీనారాయణకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు దాదాపుగా ఏపీలోని అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పార్టీ విధానాలను నచ్చక జనసేనను వీడిన లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నదానిపై చాలాకాలంగా ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరరబోతున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన ఫలానా పార్టీలో చేరబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై లక్ష్మీనారాయణ స్పందించారు.
రాబోయే ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. అయితే, తాను ఏ స్థానం నుంచి పోటీ చేస్తాను అన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే, గత ఎన్నికలలో విశాఖ నుంచి ఓటమి పాలైనప్పటికీ అక్కడి ప్రజలు తనను అభిమానిస్తున్నారని చెప్పారు. ఈసారి పోటీ చేస్తే తప్పక గెలిపించుకుంటామని విశాఖవాసులు చాలామంది తనతో అన్నారని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
దాదాపుగా ఆయన రాజకీయాలు విశాఖ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కూడా లక్ష్మీనారాయణ గతంలో నిరసన గళం వినిపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆఖరికి కేఏ పాల్ వంటి నేతలను కలిసేందుకు సైతం లక్ష్మీనారాయణ వెనుకాడలేదు. ఇక క్రౌడ్ ఫండింగ్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేందుకు బిడ్ కూడా దాఖలు చేశారు లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
This post was last modified on August 23, 2023 6:32 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…