“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు రాదన్నారు..ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అడ్డుపడ్డారు…అన్నీ అధిగమించి అద్భుతమైన ఎయిర్ పోర్టు నిర్మించాం. విమానశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టుకున్నాం..ఆయన పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది“ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చెప్పారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలో తాను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని.. దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం. ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర.“ అని పేర్కొన్నారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోడీయేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీనేనన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు. “2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది.విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం.“ అని బాబు వివరించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారిందన్న చంద్రబాబు.. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం. 2 ఏళ్లలో ప్రధాని మోడీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది.ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం. వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి.“ అని వివరించారు.
This post was last modified on August 1, 2026 11:44 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…