“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు రాదన్నారు..ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అడ్డుపడ్డారు…అన్నీ అధిగమించి అద్భుతమైన ఎయిర్ పోర్టు నిర్మించాం. విమానశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టుకున్నాం..ఆయన పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది“ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చెప్పారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలో తాను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని.. దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం. ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర.“ అని పేర్కొన్నారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోడీయేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీనేనన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు. “2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది.విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం.“ అని బాబు వివరించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారిందన్న చంద్రబాబు.. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం. 2 ఏళ్లలో ప్రధాని మోడీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది.ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం. వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి.“ అని వివరించారు.
This post was last modified on August 1, 2026 11:44 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…