మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ముందు గొయ్యి వెనుకు నుయ్యి లాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసి మైనంపల్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఏం చేస్తారన్నది చూడాలన్న టాక్ ఉంది. మరోసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కానీ మైనంపల్లి తనయుడు రోహిత్ మెదక్ సీటు ఆశించగా నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ నుంచి తనయుడు రోహిత్ పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించడం గమనార్హం. పార్టీ రోహిత్ కు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయిస్తానని మరీ మైనంపల్లి చెప్పారు. అంతే కాకుండా మెదక్లో హరీష్ రావు పెత్తనం ఏమిటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ను బట్టలు ఊడదీస్తా, సిద్ధిపేట్లో అడ్రస్ లేకుండా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాతే కేసీఆర్ జాబితా ప్రకటించారు. ఇందులో మైనంపల్లికి చోటు దక్కింది. కానీ మెదక్ నుంచి రోహిత్కు కాకుండా హరీష్ రావు సూచించిన పద్మా దేవేందర్రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని టాక్.
మరి ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారు? మరోవైపు హరీష్ వెంటే తామున్నామని, మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్టీలోని నాయకులంతా హరీష్ వెంటే ఉన్నట్లే. మరి తప్పయిందని ఒప్పుకుని మల్కాజిగిరిలో పోటీ చేస్తారా? అన్నది చూడాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేసి.. తండ్రికొడుకులు స్వతంత్రులుగా పోటీ చేస్తారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కానీ జరిగితే ఇద్దరూ ఓడిపోవడం ఖాయమేనని టాక్. లేదంటే తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ.. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రోహిత్ను నిలబెడతారా? అంటే ఆ అవకాశమూ లేదు. అందుకే మైనంపల్లి సైలెంట్గా ఉంటూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 23, 2023 6:35 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…