మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ముందు గొయ్యి వెనుకు నుయ్యి లాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసి మైనంపల్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఏం చేస్తారన్నది చూడాలన్న టాక్ ఉంది. మరోసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కానీ మైనంపల్లి తనయుడు రోహిత్ మెదక్ సీటు ఆశించగా నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ నుంచి తనయుడు రోహిత్ పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించడం గమనార్హం. పార్టీ రోహిత్ కు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయిస్తానని మరీ మైనంపల్లి చెప్పారు. అంతే కాకుండా మెదక్లో హరీష్ రావు పెత్తనం ఏమిటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ను బట్టలు ఊడదీస్తా, సిద్ధిపేట్లో అడ్రస్ లేకుండా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాతే కేసీఆర్ జాబితా ప్రకటించారు. ఇందులో మైనంపల్లికి చోటు దక్కింది. కానీ మెదక్ నుంచి రోహిత్కు కాకుండా హరీష్ రావు సూచించిన పద్మా దేవేందర్రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని టాక్.
మరి ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారు? మరోవైపు హరీష్ వెంటే తామున్నామని, మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్టీలోని నాయకులంతా హరీష్ వెంటే ఉన్నట్లే. మరి తప్పయిందని ఒప్పుకుని మల్కాజిగిరిలో పోటీ చేస్తారా? అన్నది చూడాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేసి.. తండ్రికొడుకులు స్వతంత్రులుగా పోటీ చేస్తారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కానీ జరిగితే ఇద్దరూ ఓడిపోవడం ఖాయమేనని టాక్. లేదంటే తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ.. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రోహిత్ను నిలబెడతారా? అంటే ఆ అవకాశమూ లేదు. అందుకే మైనంపల్లి సైలెంట్గా ఉంటూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 23, 2023 6:35 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…