మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ముందు గొయ్యి వెనుకు నుయ్యి లాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసి మైనంపల్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఏం చేస్తారన్నది చూడాలన్న టాక్ ఉంది. మరోసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కానీ మైనంపల్లి తనయుడు రోహిత్ మెదక్ సీటు ఆశించగా నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ నుంచి తనయుడు రోహిత్ పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించడం గమనార్హం. పార్టీ రోహిత్ కు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయిస్తానని మరీ మైనంపల్లి చెప్పారు. అంతే కాకుండా మెదక్లో హరీష్ రావు పెత్తనం ఏమిటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ను బట్టలు ఊడదీస్తా, సిద్ధిపేట్లో అడ్రస్ లేకుండా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాతే కేసీఆర్ జాబితా ప్రకటించారు. ఇందులో మైనంపల్లికి చోటు దక్కింది. కానీ మెదక్ నుంచి రోహిత్కు కాకుండా హరీష్ రావు సూచించిన పద్మా దేవేందర్రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని టాక్.
మరి ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారు? మరోవైపు హరీష్ వెంటే తామున్నామని, మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్టీలోని నాయకులంతా హరీష్ వెంటే ఉన్నట్లే. మరి తప్పయిందని ఒప్పుకుని మల్కాజిగిరిలో పోటీ చేస్తారా? అన్నది చూడాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేసి.. తండ్రికొడుకులు స్వతంత్రులుగా పోటీ చేస్తారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కానీ జరిగితే ఇద్దరూ ఓడిపోవడం ఖాయమేనని టాక్. లేదంటే తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ.. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రోహిత్ను నిలబెడతారా? అంటే ఆ అవకాశమూ లేదు. అందుకే మైనంపల్లి సైలెంట్గా ఉంటూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 23, 2023 6:35 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…