Political News

వారాహి యాత్రపై గోదావ‌రి టాక్ ఇదే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు రోజులు సాగింది. ఈ నాలుగు రోజుల యాత్ర‌పై ఇక్క‌డి ప్ర‌జలు ఎలా రియాక్ట్ అయ్యార‌నేది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిజ‌న‌సేన‌కు ఈ జిల్లాలు అత్యంత కీల‌కంగా మారాయి. దీంతో వారాహి యాత్ర‌ను కూడా ఈ జిల్లాల నుంచే ప‌వ‌న్ ప్రారంభించారు. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ముఖ్యంగా కాకినాడ‌ సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యేల‌పై ప‌వ‌న్ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో తాను వ‌స్తే ఏం చేస్తాన‌నేది కూడా వివ‌రించారు. ఇక‌, పిఠాపురంతో దాదాపు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిలో మెజారిటీ పార్ట్ ను ఈ యాత్ర పూర్తి చేసుకున్న‌ట్టు అయింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నార నేది ఇంట్ర‌స్టింగ్‌గానే కాకుండా.. ఇంపార్టెంట్‌గా కూడా మారింది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మెజారిటీ గోదావ‌రి ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను ఆద‌రించేందుకు రెడీగానే ఉన్నారు.

ఆయ‌న చెప్పిన విష‌యాల‌పై కూడా వారు దృష్టి పెట్టారు. అవినీతి ర‌హితం, కాపులు స‌మైక్యం కావ‌డం.. ఐక్యంగా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డం వంటివి బాగానే ఎక్కాయి అయితే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా రెండు ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్నాయి. ఒక‌టి అభ్య‌ర్థుల ఎంపిక‌. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి.. ప్ర‌జ‌లు ఓటే స్తారు. పార్టీ జెండాలు అజెండాలు ఎలా ఉన్నా.. అభ్య‌ర్థులు బ‌ల‌మైన వారు అయితే.. వారిని గెలిపించే ల‌క్ష‌ణం.. ఉంటుంది.

దీంతో జ‌న‌సేన అభ్య‌ర్థుల కోసం.. ఇక్క‌డ‌చాలా మంది చ‌ర్చించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఇప్ప‌టికీ ఐపు లేకుండా పోయారు. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఎక్కడా మిగిలిన‌వారు క‌నిపించ డం లేదు. దీంతో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. రెండు అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగానే సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? అనేది గోదావ‌రిలో విస్తృతంగా వినిపిస్తున్న టాక్‌. దీనిపై క్లారిటీ ఇవ్వాల‌నేది యువ‌త ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు మిన‌హా.. జ‌న‌సేన టాక్ గోదావ‌రి జిల్లాల్లో బాగానే ఉంద‌ని తెలుస్తోంది.

Share

Recent Posts

డేవిడ్ వార్నర్… జైలుకెళ్లడం ఖాయమేనా?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.…

29 minutes ago

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…

1 hour ago

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

1 hour ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

3 hours ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

6 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

10 hours ago