Political News

వారాహి యాత్రపై గోదావ‌రి టాక్ ఇదే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు రోజులు సాగింది. ఈ నాలుగు రోజుల యాత్ర‌పై ఇక్క‌డి ప్ర‌జలు ఎలా రియాక్ట్ అయ్యార‌నేది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిజ‌న‌సేన‌కు ఈ జిల్లాలు అత్యంత కీల‌కంగా మారాయి. దీంతో వారాహి యాత్ర‌ను కూడా ఈ జిల్లాల నుంచే ప‌వ‌న్ ప్రారంభించారు. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ముఖ్యంగా కాకినాడ‌ సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యేల‌పై ప‌వ‌న్ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో తాను వ‌స్తే ఏం చేస్తాన‌నేది కూడా వివ‌రించారు. ఇక‌, పిఠాపురంతో దాదాపు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిలో మెజారిటీ పార్ట్ ను ఈ యాత్ర పూర్తి చేసుకున్న‌ట్టు అయింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నార నేది ఇంట్ర‌స్టింగ్‌గానే కాకుండా.. ఇంపార్టెంట్‌గా కూడా మారింది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మెజారిటీ గోదావ‌రి ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను ఆద‌రించేందుకు రెడీగానే ఉన్నారు.

ఆయ‌న చెప్పిన విష‌యాల‌పై కూడా వారు దృష్టి పెట్టారు. అవినీతి ర‌హితం, కాపులు స‌మైక్యం కావ‌డం.. ఐక్యంగా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డం వంటివి బాగానే ఎక్కాయి అయితే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా రెండు ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్నాయి. ఒక‌టి అభ్య‌ర్థుల ఎంపిక‌. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి.. ప్ర‌జ‌లు ఓటే స్తారు. పార్టీ జెండాలు అజెండాలు ఎలా ఉన్నా.. అభ్య‌ర్థులు బ‌ల‌మైన వారు అయితే.. వారిని గెలిపించే ల‌క్ష‌ణం.. ఉంటుంది.

దీంతో జ‌న‌సేన అభ్య‌ర్థుల కోసం.. ఇక్క‌డ‌చాలా మంది చ‌ర్చించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఇప్ప‌టికీ ఐపు లేకుండా పోయారు. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఎక్కడా మిగిలిన‌వారు క‌నిపించ డం లేదు. దీంతో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. రెండు అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగానే సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? అనేది గోదావ‌రిలో విస్తృతంగా వినిపిస్తున్న టాక్‌. దీనిపై క్లారిటీ ఇవ్వాల‌నేది యువ‌త ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు మిన‌హా.. జ‌న‌సేన టాక్ గోదావ‌రి జిల్లాల్లో బాగానే ఉంద‌ని తెలుస్తోంది.

Satya

Recent Posts

ప్రమాదంపై రాజకీయాలేల బాసూ…!

ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…

1 hour ago

పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…

2 hours ago

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం

ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…

2 hours ago

ఇండియా కూటమి మీటింగ్‌కు విజయ్ దూరం.. కారణాలివే!

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…

3 hours ago

మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు…

4 hours ago

తమన్ జేబులో ఎనిమిది సినిమాలు

ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…

5 hours ago