తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే.. రాజకీయ దురంధరుడిగా.. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయ గల దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ముచ్చటగా మూడో సారి విజయం దక్కించుకుని తెలంగా ణపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కేసీఆర్కు కాంగ్రెస్ వ్యూహాలు ఇరకాటంగా మారాయనే చర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకొంటున్న కాంగ్రెస్పార్టీ.. నిన్న మొన్నటి వరకు ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు చాలా వరకు పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
మరీ ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయకులకు.. అందునా.. బలమైన సామాజికవ ర్గం, ప్రజల్లో మన్నన, వారి ఫాలోయింగ్ ఉన్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, నాగం జనార్దన్రెడ్డి వంటివారికి వ్యూహాత్మకంగా గేలం వేసి.. వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కేసీఆర్కు సవాల్ రువ్వుతోంది. నిజానికి వీరిని తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. వీరంతా కూడా.. రాజకీయంగా ఉద్ధండులు. వీరితోపాటు.. మరికొందరు కూడా.. లైన్లో ఉన్నారనేది మరో చర్చ.
తొలుత బలమైన వారిని పార్టీలో చేర్చుకుంటే.. తర్వాత.. మిగిలిన చేపలను ఒడిసి పట్టుకోవచ్చన్న రేవంత్రెడ్డి వ్యూహం చకాచకా అమలైతే.. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కేసీఆర్ వ్యూహాలకు పదును తగ్గుతుందని పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఇదిలావుంటే వైఎస్ తనయ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల కూడా.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై గుంభనంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. అంతర్గత చర్చల్లో మాత్రం ఒకింత జాగ్రత్త పడుతున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. సొంత పార్టీలోనే సగం మంది ఎమ్మెల్యేల పరిస్థితి విమర్శలకు… దారితీస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఓడిపోయే నాయకుల జాబితా కూడా కేసీఆర్ వద్ద ఉంది. ఇప్పటికిప్పుడు వీరిని కాదన్నా తంటానే.. అలాగని టికెట్లు ఇచ్చినా.. పెద్ద మైనస్సే అవుతుంది. ఈ పరిణామాలను అంచనా వేసుకుని.. కాంగ్రెస్ బలపేతం కాకుండా.. ఎలా అడ్డుకోవాలనేది ఇప్పుడు కేసీఆర్ ముందున్న భారీ టాస్క్ అని అంటున్నారు ప్రగతి భవన్ సీనియర్ నాయకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 23, 2023 2:36 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…