40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ అప్పు పుట్టింది. ఈ సారి ఏకంగా రూ. 3 వేల 500 కోట్లకు రిజర్వ్ బ్యాంకు ఒప్పుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం ఈ అప్పు తెచ్చుకునే వెసులుబాటు పొందింది.

ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంది. మొత్తం ఐదు వడ్డీ స్లాబుల్లో ఏపీకి అప్పు పుడుతుంది.

రాష్ట్రానికి అప్పు రావడంతో అటు నేతలు ఇటు సామాన్యులు సంతోషపడుతున్నారు. వచ్చే రూ.3,500 కోట్లలో దాదాపు రూ. 1,500 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద మినహాయించుకునే అవకాశం ఉంది. మిగతా డబ్బులతో వేతనాలు, పెన్షన్లు వస్తాయని ఆదాయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి..

ఏపీ అప్పులు విపతీరంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు దాటి కొత్త అప్పులు చేస్తున్నారు. గత 40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు చేశారని లెక్కతేలింది. మరో పక్క వడ్డీలు చెల్లించేందుకే ఆదాయంలో 30 శాతం పోతోందని ఓ అంచనా…