వీరభద్రుడు / కరుప్పు బ్లాక్ బస్టర్ హిట్టుతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన హీరో సూర్య తక్కువ గ్యాప్ లోనే మరో కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14 విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో మమిత బైజు హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆన్ లైన్ లో తిరుగుతున్న వాయిదా వార్తలను ఖండిస్తూ టీమ్ ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టింది.
దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం తమిళంలోనే తీశామని, ఆర్టిస్టు అంటే సూర్యకు ప్రైమ్ ఆడియన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారో, ఆ లాంగ్వేజ్ లో తీయడం వల్ల సౌకర్యం ఉంటుందని, అందుకే తెలుగులో డబ్బింగ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ధనుష్ సర్ ప్రస్తావన వచ్చినప్పుడు అది మాత్రం రెండు భాషల్లో తీశామని, రెండు గమనిస్తే మీకీ విషయం అర్థమవుతుందని అన్నారు. ఇక్కడే లాజిక్ మిస్ అవుతోంది.
సూర్యకు మెయిన్ టార్గెట్ తమిళం అయినప్పుడు ధనుష్ కు కూడా అంతేగా. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ధనుష్ కంటే సూర్యకే ఎక్కువ ఫ్యాన్స్, గుర్తింపు ఉన్నాయి. కొన్ని రీ రిలీజులు ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో చూశాం. అలాంటప్పుడు రెండు భాషల్లో తీయాల్సింది ఎవరి సినిమా. ఇది బేసిక్ క్వశ్చన్. ఒక టాలీవుడ్ దర్శకుడిగా సూర్యని ఒప్పించి తెలుగులో కూడా తీయాల్సింది పోయి కేవలం తమిళంకే పరిమితం కావడం ఏమిటనేది మూవీ లవర్స్ ప్రశ్న.
సరే ఇది తప్పని ఎవరూ చెప్పలేరు కానీ సర్ తీసేటప్పుడు రాని ఇబ్బంది విశ్వనాథ్ అండ్ సన్స్ చవి చూడటం విచిత్రంగా ఉంది. పాతికేళ్ల అమ్మాయి నలభై వయసు దాటిన వ్యక్తిని ప్రేమించడమనే పాయింట్ తీసుకున్న వెంకీ అట్లూరి ఇలాంటి నేపథ్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హిట్టు తర్వాత వస్తున్న సూర్య సినిమా కావడంతో బిజినెస్ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ తో మెప్పిస్తే మటుకు ఇంకో విజయం ఖాతాలో పడినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates

