Political News

ఒక్క ఓటు రాజకీయం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి షాకిచ్చాయి. అనూహ్యంగా మూడు చోట్ల పరాజయం పాలు కావటంతో అధికార పార్టీకి దిమ్మతిరిగింది.టీడీపీలో జోష్ కనిపిస్తుండగా. వైసీపీలో ఎక్కడ లేని టెన్షన్ తప్పడం లేదు. అందుకు ఒక కారణం కూడా ఉంది. అదే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలుగా చెప్పుకోవాలి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగడంతో వైసీపీకి దిక్కుతోచడం లేదు.

ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరుగుతాయి. మొత్తం ఏడు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వైసీపీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. సంఖ్య బలం చూసుకుని టీడీపీ పోటీ చేయదనుకున్న వైసీపీ ఇప్పుడు తప్పులో కాలేసినట్లయ్యింది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీసీ మహిళ పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగారు. దానికి ఇప్పుడు లెక్కలేసుకుంటున్న వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి…

ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏడో అభ్యర్థి గెలవాలంటే 22 తొలి ప్రాధాన్య ఓట్లు రావాలని చెబుతున్నారు. నిజానికి అసెంబ్లీ వైసీపీ తరపున 151 మంది గెలిచారు. టీడీపీ తరపున 23 మంది నెగ్గారు. జనసేన ఒక అభ్యర్థిని గెలిపించుకు్ంది. టీడీపీకి చెందిన నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ పంచన చేరారు. దానితో తమ విజయానికి ఇబ్బంది లేదనుకుని జగన్ ధైర్యంగా ఏడుగురిని రంగంలోకి దించారు.

టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగిన తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది. వైసీపీపై అలిగిన నెల్లూరు పెద్దారెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. నలుగురు దూరం జరగడం కారణంగా టీడీపీ బలం 19కి పడిపోయినా.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఓటేస్తే వచ్చే ఓట్ల సంఖ్య 21కి పెరుగుతోంది..

అనురాధ గెలవాలంటే ఇంకో ఓటు వస్తే సరిపోతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ ఎదురుచూడటం వల్లే అభ్యర్థిని నిలబెట్టారని అంటున్నారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటే ఇప్పుడు అనురాధకు ఓటేస్తామని చెబుతున్నారట. విశ్వాసం కలిగించేందుకు కావాలంటే ఓటును చూపించి మరీ వేస్తామంటున్నారట. అయితే టీడీపీ వైపుకు రావాలనుకుంటున్న వారికి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని తెలియడంతో వారి సాయం తీసుకునేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో తమ నాయకులు వ్యతిరేకించే వీలుందని కూడా భావిస్తున్నారు. అయినా ఆ ఒక్క ఓటుకు ఇబ్బందేమీ లేదన్నది టీడీపీ ధీమా..

This post was last modified on March 23, 2023 7:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

3 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

8 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

10 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago