ప్రస్తుతం వరుస లైనప్ తో ఫుల్ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ధమాకా’ ఇచ్చిన సక్సెస్ తో వచ్చే నెల ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావ్’ , ‘ఈగల్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత రవితేజ దర్శకుడు వీరు పోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
తొలుత వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వీరు పోట్ల దర్శకుడిగా బిందాస్ , దూసుకెళ్తా, రగడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకున్నాడు కానీ ఏది సెట్ అవ్వలేదు.
తాజాగా వీరు పోట్ల రవితేజకి ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. రవితేజ కి కథ బాగా నచ్చడంతో తన లైనప్ పక్కన పెట్టి మరీ ఈ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. రవితేజ తో అనిల్ సుంకర ఎప్పటి నుండో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఫైనల్ గా వీరు పోట్ల ప్రాజెక్ట్ తో ఇన్నాళ్ళకి మాస్ మహారాజాతో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.
వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ భావిస్తున్నాడట. ఇప్పటికే వీరు పోట్ల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఘాట్ కి రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on March 23, 2023 7:36 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…