ప్రస్తుతం వరుస లైనప్ తో ఫుల్ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ధమాకా’ ఇచ్చిన సక్సెస్ తో వచ్చే నెల ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావ్’ , ‘ఈగల్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత రవితేజ దర్శకుడు వీరు పోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
తొలుత వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వీరు పోట్ల దర్శకుడిగా బిందాస్ , దూసుకెళ్తా, రగడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకున్నాడు కానీ ఏది సెట్ అవ్వలేదు.
తాజాగా వీరు పోట్ల రవితేజకి ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. రవితేజ కి కథ బాగా నచ్చడంతో తన లైనప్ పక్కన పెట్టి మరీ ఈ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. రవితేజ తో అనిల్ సుంకర ఎప్పటి నుండో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఫైనల్ గా వీరు పోట్ల ప్రాజెక్ట్ తో ఇన్నాళ్ళకి మాస్ మహారాజాతో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.
వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ భావిస్తున్నాడట. ఇప్పటికే వీరు పోట్ల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఘాట్ కి రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…