ప్రస్తుతం వరుస లైనప్ తో ఫుల్ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ధమాకా’ ఇచ్చిన సక్సెస్ తో వచ్చే నెల ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావ్’ , ‘ఈగల్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత రవితేజ దర్శకుడు వీరు పోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
తొలుత వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వీరు పోట్ల దర్శకుడిగా బిందాస్ , దూసుకెళ్తా, రగడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకున్నాడు కానీ ఏది సెట్ అవ్వలేదు.
తాజాగా వీరు పోట్ల రవితేజకి ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. రవితేజ కి కథ బాగా నచ్చడంతో తన లైనప్ పక్కన పెట్టి మరీ ఈ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. రవితేజ తో అనిల్ సుంకర ఎప్పటి నుండో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఫైనల్ గా వీరు పోట్ల ప్రాజెక్ట్ తో ఇన్నాళ్ళకి మాస్ మహారాజాతో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.
వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ భావిస్తున్నాడట. ఇప్పటికే వీరు పోట్ల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఘాట్ కి రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on March 23, 2023 7:36 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…