“మనం అధికారంలో ఉన్నాం. అందరూ మనవైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. ఐకమత్యంగా ఉండాలి. కలిసి మెలిసి పనిచేయాలి. పార్టీని గెలిపించాలి”- ఇదీ.. పార్టీ అధినేత, సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. నేతలకే కాదు.. జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు కూడా ఇదే ఆయన చెబుతున్నారు. కానీ, ఎక్కడ లోపం జరుగుతోందో తెలియడం లేదు కానీ, చాలా జిల్లాల్లో మంత్రులు విఫలమవుతున్నారు.
ప్రస్తుతం తెర మీదికి వచ్చిన ఒక్క అనంతపురం మాత్రమే కాదు.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్కడ ఇంచార్జ్ మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. నేతల మధ్య సఖ్యతను పెంపొందించడంలో వారు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరగడంతోపాటు.. ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్న నాయకులకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
గత ఎన్నికల సమయంలో పనిచేసిన వారిని పట్టించుకోకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. పార్టీ అధికారంలో ఉందని.. తమకు పనులు అవుతాయని నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయింది. అయితే.. ఒక్క పనికూడా జరగలేదు. ఇదీ.. వారి ఆవేదన మరో ఏడాదిలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇక, అప్పుడు మళ్లీ ఎన్నికలయ్యాక చూద్దామనే మాట ఎలానూ చెబుతారు. అందుకే ఎక్కడికక్కడ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వొద్దని బాహాటంగానే చెబుతున్నారు. శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు మామూలుగా సెగ తగలడం లేదు. ఇక, విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైలవరంలోనూ సొంత నేతల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి.
విజయవాడ తూర్పులో నాయకులు సహాయ నిరాకరణ ప్రకటించారు. ఇలా రాష్ట్రంలో సుమారు 25 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉందని ఒక అంచనా. మరి వీటిని ఎవరు దారిలో పెడతారు? ఎప్పటికి దారికి తెస్తారు? అనేది చూడాల్సి ఉంటుంది.
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…