Political News

జగన్ చెబుతుందేమిటి.. మీరు చేస్తుందేమిటి

“మ‌నం అధికారంలో ఉన్నాం. అంద‌రూ మ‌న‌వైపు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఐక‌మ‌త్యంగా ఉండాలి. క‌లిసి మెలిసి ప‌నిచేయాలి. పార్టీని గెలిపించాలి”- ఇదీ.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. నేత‌లకే కాదు.. జిల్లాల ఇంచార్జ్ మంత్రుల‌కు కూడా ఇదే ఆయ‌న చెబుతున్నారు. కానీ, ఎక్క‌డ లోపం జ‌రుగుతోందో తెలియ‌డం లేదు కానీ, చాలా జిల్లాల్లో మంత్రులు విఫ‌ల‌మ‌వుతున్నారు.

ప్ర‌స్తుతం తెర‌ మీదికి వ‌చ్చిన ఒక్క అనంత‌పురం మాత్ర‌మే కాదు.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్క‌డ ఇంచార్జ్ మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంపొందించ‌డంలో వారు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి పెర‌గ‌డంతోపాటు.. ఎమ్మెల్యేల‌కు స్థానికంగా ఉన్న నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌నిచేసిన వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం పెద్ద ఇబ్బందిగా మారింది. పార్టీ అధికారంలో ఉంద‌ని.. త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ.. ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయింది. అయితే.. ఒక్క ప‌నికూడా జ‌ర‌గ‌లేదు. ఇదీ.. వారి ఆవేద‌న మ‌రో ఏడాదిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటుంది. ఇక‌, అప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌య్యాక చూద్దామ‌నే మాట ఎలానూ చెబుతారు. అందుకే ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు కూడా టికెట్లు ఇవ్వొద్ద‌ని బాహాటంగానే చెబుతున్నారు. శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు మామూలుగా సెగ త‌గ‌ల‌డం లేదు. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైల‌వ‌రంలోనూ సొంత నేత‌ల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరాయి.

విజ‌య‌వాడ తూర్పులో నాయ‌కులు స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఇలా రాష్ట్రంలో సుమారు 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని ఒక అంచ‌నా. మ‌రి వీటిని ఎవ‌రు దారిలో పెడ‌తారు? ఎప్ప‌టికి దారికి తెస్తారు? అనేది చూడాల్సి ఉంటుంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

28 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago