Political News

సాయిరెడ్డి సైలెంట్.. ఏం చేస్తున్నారో?!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీలో నెంబ‌ర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పోనీ..పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి క‌దా..అక్క‌డ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్క‌డున్నా.. సంచ‌ల‌నం సృష్టిస్తారాయే! సో, ఆయ‌న ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మ‌రి ఏం చేస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మ‌రో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయ‌న పిట్ట క‌బుర్ల రాత క‌నిపిస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటిది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో సాయిరెడ్డి ఎక్క‌డ ? అనే స‌హ‌జ సందేహం మీడియా వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఇండియాలోనే ఉన్నార‌ని.. అయితే.. గోప్యంగా ఆయ‌న మీడియా ఛానెల్ ప‌నుల‌పై తిరుగుతున్నార‌ని తెలుస్తోంది.

ఇదే విష‌యాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు కూడా చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మీడియా పెడ‌తా, పేప‌ర్‌పెడ‌తా అంటూ.. కొన్ని రోజుల కింద సాయిరెడ్డి ప్ర‌క‌ట‌నలు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆ ప‌నుల పైనే ఆయ‌న బెంగ‌ళూరులో ఉన్నార‌ని, బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి రెండు ప్రైవేటు ఛానెళ్లు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం.

ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఏపీలో రాజ‌కీయ‌ప‌ర‌మైన చానెల్‌ను ప్రారంభించేందుకు సాయిరెడ్డి లెక్క‌లు వేస్తున్నార‌నేది వైసీపీ లో ఆయ‌న వ‌ర్గంగా ప్ర‌చారం పొందిన కొంద‌రు చెబుతున్న మాట‌. మొత్తానికి త్వ‌ర‌లోనే సాయిరెడ్డి ఛానెల్ ప్రారంభం కానుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

This post was last modified on December 20, 2022 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago