వైసీపీ కీలక నాయకుడు, పార్టీలో నెంబర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్కడా కనిపించడం లేదు. పోనీ..పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా..అక్కడ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్కడున్నా.. సంచలనం సృష్టిస్తారాయే! సో, ఆయన ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మరి ఏం చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మరో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన పిట్ట కబుర్ల రాత కనిపిస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డి ఎక్కడ ? అనే సహజ సందేహం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారని.. అయితే.. గోప్యంగా ఆయన మీడియా ఛానెల్ పనులపై తిరుగుతున్నారని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని కొందరు వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. త్వరలోనే మీడియా పెడతా, పేపర్పెడతా అంటూ.. కొన్ని రోజుల కింద సాయిరెడ్డి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆ పనుల పైనే ఆయన బెంగళూరులో ఉన్నారని, బాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. సదరు దర్శకుడికి రెండు ప్రైవేటు ఛానెళ్లు కూడా ఉన్నాయని సమాచారం.
ఆయన మార్గదర్శకత్వంలో ఏపీలో రాజకీయపరమైన చానెల్ను ప్రారంభించేందుకు సాయిరెడ్డి లెక్కలు వేస్తున్నారనేది వైసీపీ లో ఆయన వర్గంగా ప్రచారం పొందిన కొందరు చెబుతున్న మాట. మొత్తానికి త్వరలోనే సాయిరెడ్డి ఛానెల్ ప్రారంభం కానుందనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 20, 2022 7:19 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…