వైసీపీ కీలక నాయకుడు, పార్టీలో నెంబర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్కడా కనిపించడం లేదు. పోనీ..పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా..అక్కడ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్కడున్నా.. సంచలనం సృష్టిస్తారాయే! సో, ఆయన ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మరి ఏం చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మరో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన పిట్ట కబుర్ల రాత కనిపిస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డి ఎక్కడ ? అనే సహజ సందేహం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారని.. అయితే.. గోప్యంగా ఆయన మీడియా ఛానెల్ పనులపై తిరుగుతున్నారని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని కొందరు వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. త్వరలోనే మీడియా పెడతా, పేపర్పెడతా అంటూ.. కొన్ని రోజుల కింద సాయిరెడ్డి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆ పనుల పైనే ఆయన బెంగళూరులో ఉన్నారని, బాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. సదరు దర్శకుడికి రెండు ప్రైవేటు ఛానెళ్లు కూడా ఉన్నాయని సమాచారం.
ఆయన మార్గదర్శకత్వంలో ఏపీలో రాజకీయపరమైన చానెల్ను ప్రారంభించేందుకు సాయిరెడ్డి లెక్కలు వేస్తున్నారనేది వైసీపీ లో ఆయన వర్గంగా ప్రచారం పొందిన కొందరు చెబుతున్న మాట. మొత్తానికి త్వరలోనే సాయిరెడ్డి ఛానెల్ ప్రారంభం కానుందనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 20, 2022 7:19 am
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…