వైసీపీ కీలక నాయకుడు, పార్టీలో నెంబర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్కడా కనిపించడం లేదు. పోనీ..పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా..అక్కడ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్కడున్నా.. సంచలనం సృష్టిస్తారాయే! సో, ఆయన ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మరి ఏం చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మరో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన పిట్ట కబుర్ల రాత కనిపిస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డి ఎక్కడ ? అనే సహజ సందేహం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారని.. అయితే.. గోప్యంగా ఆయన మీడియా ఛానెల్ పనులపై తిరుగుతున్నారని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని కొందరు వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. త్వరలోనే మీడియా పెడతా, పేపర్పెడతా అంటూ.. కొన్ని రోజుల కింద సాయిరెడ్డి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆ పనుల పైనే ఆయన బెంగళూరులో ఉన్నారని, బాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. సదరు దర్శకుడికి రెండు ప్రైవేటు ఛానెళ్లు కూడా ఉన్నాయని సమాచారం.
ఆయన మార్గదర్శకత్వంలో ఏపీలో రాజకీయపరమైన చానెల్ను ప్రారంభించేందుకు సాయిరెడ్డి లెక్కలు వేస్తున్నారనేది వైసీపీ లో ఆయన వర్గంగా ప్రచారం పొందిన కొందరు చెబుతున్న మాట. మొత్తానికి త్వరలోనే సాయిరెడ్డి ఛానెల్ ప్రారంభం కానుందనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 20, 2022 7:19 am
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…