Political News

కాంట్ర‌వ‌ర్సీల కేరాఫ్‌గా ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌…!

ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌.. వివాదాల‌కు కేంద్రంగా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ కేంద్ర మ‌హిళా క‌మిష‌న్‌. దీనిని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. అయితే.. దీని సూచ‌న‌ల‌మేరకు.. కేంద్రం ఏర్పాటు చేసిన కొన్నిక‌మిటీల సూచ‌న‌ల మేరకు.. ఆయా రాష్ట్రాల్లోనూ మ‌హిళా క‌మిష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. వీటి ప్ర‌ధాన క‌ర్త‌వ్యం.. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం.. వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. వారిలో స్వ‌యం చాల‌క శ‌క్తిని ప్రోది చేయ‌డం వంటివి కీల‌కంగా ఉన్నాయి. ఇక‌, రాష్ట్రాల్లో మ‌హిళా క‌మిష‌న్లు.. అన్ని చోట్లా ఉన్నాయా? అంటే.. లేవ‌నే చెప్పాలి.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ.. క‌ర్ణాట‌క‌, కేరళ‌ల్లో మాత్ర‌మే ఈ క‌మిష‌న్లు ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో తొలిసారి న‌వ్యాంధ్ర‌లో ఈ క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. అప్ప‌ట్లో న‌న్న‌ప‌నేనిరాజ‌కుమారి .. చైర్ ప‌ర్స్‌గా నియ‌మితుల‌య్యారు.

మ‌హిళ‌ల‌ పై దాడుల‌ను నిరోధించేందుకు.. మ‌హిళ‌ల‌ క‌ష్టాలు తీర్చేందుకు.. క‌మిష‌న్ ఎంతో ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న‌ను ఆమె చేసి చూపించారు. అయితే.. వైసీపీ హ‌యాంలో తొలి ఏడాది త‌ర్వాత‌.. ఏర్పాటు చేసిన మ‌హిళా క‌మిష‌న్‌కు.. వాసిరెడ్డి ప‌ద్మ‌ను నియ‌మించారు. ఈమెకు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చామ‌ని.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో చర్య‌లు తీసుకోవాల‌ని చెప్పామ‌ని.. ఈ ఏడాది మార్చిలో వ‌చ్చిన మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా.. సీఎం పేర్కొన్నారు. కానీ, మ‌హిళా క‌మిష‌న్ మాత్రం రాజ‌కీయ కేంద్రంగా మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

త‌న వారి ప‌ట్ల దాడులు జ‌రిగితే.. ఒక విధంగా పొరుగు వారి ప‌ట్ల జ‌రిగితే మ‌రోవిధంగా స్పందిస్తోంద‌నే.. వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ మ‌హిళా నాయ‌కుల ప‌ట్ల పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌డు.. అసలు ఆమె ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ ఎపిసోడ్‌లోనూ.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నార‌ని.. ఇది ఏమాత్రం స‌మంజ‌సం కాద‌ని.. అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హిళా క‌మిష‌న్ రాజ‌కీయ బందీగా మారింద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 24, 2022 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

44 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago