Political News

కాంట్ర‌వ‌ర్సీల కేరాఫ్‌గా ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌…!

ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌.. వివాదాల‌కు కేంద్రంగా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ కేంద్ర మ‌హిళా క‌మిష‌న్‌. దీనిని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. అయితే.. దీని సూచ‌న‌ల‌మేరకు.. కేంద్రం ఏర్పాటు చేసిన కొన్నిక‌మిటీల సూచ‌న‌ల మేరకు.. ఆయా రాష్ట్రాల్లోనూ మ‌హిళా క‌మిష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. వీటి ప్ర‌ధాన క‌ర్త‌వ్యం.. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం.. వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. వారిలో స్వ‌యం చాల‌క శ‌క్తిని ప్రోది చేయ‌డం వంటివి కీల‌కంగా ఉన్నాయి. ఇక‌, రాష్ట్రాల్లో మ‌హిళా క‌మిష‌న్లు.. అన్ని చోట్లా ఉన్నాయా? అంటే.. లేవ‌నే చెప్పాలి.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ.. క‌ర్ణాట‌క‌, కేరళ‌ల్లో మాత్ర‌మే ఈ క‌మిష‌న్లు ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో తొలిసారి న‌వ్యాంధ్ర‌లో ఈ క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. అప్ప‌ట్లో న‌న్న‌ప‌నేనిరాజ‌కుమారి .. చైర్ ప‌ర్స్‌గా నియ‌మితుల‌య్యారు.

మ‌హిళ‌ల‌ పై దాడుల‌ను నిరోధించేందుకు.. మ‌హిళ‌ల‌ క‌ష్టాలు తీర్చేందుకు.. క‌మిష‌న్ ఎంతో ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న‌ను ఆమె చేసి చూపించారు. అయితే.. వైసీపీ హ‌యాంలో తొలి ఏడాది త‌ర్వాత‌.. ఏర్పాటు చేసిన మ‌హిళా క‌మిష‌న్‌కు.. వాసిరెడ్డి ప‌ద్మ‌ను నియ‌మించారు. ఈమెకు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చామ‌ని.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో చర్య‌లు తీసుకోవాల‌ని చెప్పామ‌ని.. ఈ ఏడాది మార్చిలో వ‌చ్చిన మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా.. సీఎం పేర్కొన్నారు. కానీ, మ‌హిళా క‌మిష‌న్ మాత్రం రాజ‌కీయ కేంద్రంగా మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

త‌న వారి ప‌ట్ల దాడులు జ‌రిగితే.. ఒక విధంగా పొరుగు వారి ప‌ట్ల జ‌రిగితే మ‌రోవిధంగా స్పందిస్తోంద‌నే.. వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ మ‌హిళా నాయ‌కుల ప‌ట్ల పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌డు.. అసలు ఆమె ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ ఎపిసోడ్‌లోనూ.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నార‌ని.. ఇది ఏమాత్రం స‌మంజ‌సం కాద‌ని.. అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హిళా క‌మిష‌న్ రాజ‌కీయ బందీగా మారింద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 24, 2022 5:19 pm

Share

Recent Posts

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

1 hour ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

1 hour ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

2 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

2 hours ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

3 hours ago

30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు…

3 hours ago