ఏపీ మహిళా కమిషన్.. వివాదాలకు కేంద్రంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి రాజ్యాంగ బద్ధమైన సంస్థ కేంద్ర మహిళా కమిషన్. దీనిని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. అయితే.. దీని సూచనలమేరకు.. కేంద్రం ఏర్పాటు చేసిన కొన్నికమిటీల సూచనల మేరకు.. ఆయా రాష్ట్రాల్లోనూ మహిళా కమిషన్లను ఏర్పాటు చేశారు. వీటి ప్రధాన కర్తవ్యం.. మహిళలకు భద్రత కల్పించడం.. వారికి అవగాహన కల్పించడం.. వారిలో స్వయం చాలక శక్తిని ప్రోది చేయడం వంటివి కీలకంగా ఉన్నాయి. ఇక, రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు.. అన్ని చోట్లా ఉన్నాయా? అంటే.. లేవనే చెప్పాలి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఏపీ.. కర్ణాటక, కేరళల్లో మాత్రమే ఈ కమిషన్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో తొలిసారి నవ్యాంధ్రలో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో నన్నపనేనిరాజకుమారి .. చైర్ పర్స్గా నియమితులయ్యారు.
మహిళల పై దాడులను నిరోధించేందుకు.. మహిళల కష్టాలు తీర్చేందుకు.. కమిషన్ ఎంతో ప్రయత్నిస్తోందనే వాదనను ఆమె చేసి చూపించారు. అయితే.. వైసీపీ హయాంలో తొలి ఏడాది తర్వాత.. ఏర్పాటు చేసిన మహిళా కమిషన్కు.. వాసిరెడ్డి పద్మను నియమించారు. ఈమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పామని.. ఈ ఏడాది మార్చిలో వచ్చిన మహిళా దినోత్సవం సందర్భంగా.. సీఎం పేర్కొన్నారు. కానీ, మహిళా కమిషన్ మాత్రం రాజకీయ కేంద్రంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.
తన వారి పట్ల దాడులు జరిగితే.. ఒక విధంగా పొరుగు వారి పట్ల జరిగితే మరోవిధంగా స్పందిస్తోందనే.. వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ మహిళా నాయకుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినప్పడు.. అసలు ఆమె పట్టించుకోలేదు. మరోవైపు.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ ఎపిసోడ్లోనూ.. ఆచి తూచి వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే.. ఆయన విషయంలో సీరియస్గా ఉన్నారని.. ఇది ఏమాత్రం సమంజసం కాదని.. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ రాజకీయ బందీగా మారిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 24, 2022 5:19 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…