డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత ఇటీవలే కన్ఫర్మ్ చేయడంతో 2026 బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫౌజీ పేరు మీదే ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటిదాకా టీమ్ నుంచి వచ్చినవి కేవలం రెండు పోస్టర్లు మాత్రమే. పాటల విడుదల ఇంకా స్టార్ట్ చేయలేదు. విశాల్ చంద్రశేఖర్ చాలా గొప్ప ఆల్బమ్ ఇచ్చాడనేది యూనిట్ వర్గాల మాట.
ప్రమోషన్ల పరంగా ఫౌజీ కొత్త తరహాలో వెళ్ళబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంటే ఎలాంటి వీడియో కంటెంట్ లేకుండా కేవలం స్టిల్స్, పోస్టర్స్ తోనే పబ్లిసిటీ చేస్తారన్న మాట. ఈ లెక్కన ట్రైలర్ కూడా రాదు. కంటెంట్ అంత సాలిడ్ గా ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని, విజువల్స్ ద్వారా కథను గెస్ చేసే అవకాశం ఇవ్వకుండా ఇలా అనుకుంటున్నారని వినికిడి. అయితే నిజంగా ఫిక్స్ అయ్యారా లేక కేవలం ఆలోచన దశ దగ్గర ఉందానేది ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
రాజా సాబ్ డిజాస్టర్ దెబ్బ మాములుగా తగల్లేదు. ఫ్యాన్స్ తెగ ఫీలైపోయి దర్శకుడు మారుతీని నెలల తరబడి ట్రోలింగ్ చేశారు. ఆయన చాలా కాలం బయట కనిపించడం కూడా మానేశారు. ఇప్పటికీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. హ్యాపీ పొంగల్ పేరుతో ఒక స్క్రిప్ట్ రాసుకున్నారని, హీరో లాక్ అయితే తప్ప ప్రకటన రాదని ఆల్రెడీ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ గాయం ఫౌజీ మాన్పాలని ఫ్యాన్స్ కోరిక. ఇదిలా ఉండగా ఫౌజీని ప్యాన్ ఇండియా భాషల్లోనే కాకుండా వీలైనన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా ప్లాన్ చేస్తున్నారట. .
దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం చివరి షెడ్యూల్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ మినహాయిస్తే అటుపై కేవలం మూడు నెలలు మాత్రమే టైం ఉంటుంది. ప్రమోషన్లు చేసినా చేయకపోయినా ఫస్ట్ కాపీ అయితే నవంబర్ రెండో వారంకంతా సిద్ధం కావలి. ఓవర్సీస్ కంటెంట్ డెలివరీలో చివరి నిమిషం టెన్షన్లు లేకుండా చూసుకోవాలి. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఫౌజీ ఇంకా బిజినెస్ డీల్స్ ఖరారు చేయలేదని సమాచారం.
This post was last modified on August 4, 2026 2:25 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…