అసలేం జరుగుతోందో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే సంక్రాంతి పోటీకి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్ల బుర్రలు వేడెక్కిపోతుండగా తాజాగా ఏజెంట్ కూడా అదే పండక్కు రిలీజ్ చేస్తామని నిర్మాతలు కొత్త పోస్టర్ విడుదల చేయడం టపాసులు కాల్చకుండానే మంటలు పుట్టిస్తోంది. ఆది పురుష్ లేదా మిగిలిన మూడింట్లో ఒకటి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈ అనౌన్స్ మెంట్ రావడం అసలు ట్విస్ట్. ఎందుకంటే అయిదో సినిమాకు ఆ సీజన్లో స్పేస్ దొరకడం కష్టం. ఏదోలా రిలీజ్ చేయొచ్చు కానీ సరిపడా స్క్రీన్లు దొరకడం ముమ్మాటికీ అసాధ్యం.
అసలే ఏజెంట్ ప్యాన్ ఇండియా మూవీ. అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. పైగా మమ్ముట్టి కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బాలకృష్ణ విజయ్ ప్రభాస్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్లతో అఖిల్ మొదటి సారి చేస్తున్న యాక్షన్ గ్రాండియర్ ని దింపడం రిస్క్ అవుతుంది. పైగా ఇలాంటివి సోలోగా వస్తేనే బెటర్. ఎంత జనాలు ఎక్కువ సినిమాలు చూసే మూడ్ లో ఉన్నా మరీ ఇన్నేసి వస్తే లేనిపోని కన్ఫ్యూజన్ కి తావిచ్చి దాని వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. నిర్మాత అనిల్ సుంకర ఏ ప్లాన్ తో ఇలా డిసైడ్ చేశారో చూడాలి.
ఊహించని ఈ షాక్ కి అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. వాళ్ళ హీరోలకు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ లో పెద్దగా కాంపిటేషన్ లేదు కాబట్టి ఆ టైంలో వస్తే బెటరని వాళ్ళ అభిప్రాయం. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏజెంట్ షూటింగ్ ఇంకా బాలన్స్ ఉంది. ఎంతనేది బయటికి చెప్పడం లేదు కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేస్తానని మాటిచ్చారట. అలాంటప్పుడు అదే నెలలో థియేటర్లలో దింపడం సాధ్యం కాదు. టీజర్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు. మరి ఏజెంట్ ఎందుకు ఝలక్ ఇచ్చాడబ్బా
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…