అసలేం జరుగుతోందో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే సంక్రాంతి పోటీకి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్ల బుర్రలు వేడెక్కిపోతుండగా తాజాగా ఏజెంట్ కూడా అదే పండక్కు రిలీజ్ చేస్తామని నిర్మాతలు కొత్త పోస్టర్ విడుదల చేయడం టపాసులు కాల్చకుండానే మంటలు పుట్టిస్తోంది. ఆది పురుష్ లేదా మిగిలిన మూడింట్లో ఒకటి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈ అనౌన్స్ మెంట్ రావడం అసలు ట్విస్ట్. ఎందుకంటే అయిదో సినిమాకు ఆ సీజన్లో స్పేస్ దొరకడం కష్టం. ఏదోలా రిలీజ్ చేయొచ్చు కానీ సరిపడా స్క్రీన్లు దొరకడం ముమ్మాటికీ అసాధ్యం.
అసలే ఏజెంట్ ప్యాన్ ఇండియా మూవీ. అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. పైగా మమ్ముట్టి కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బాలకృష్ణ విజయ్ ప్రభాస్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్లతో అఖిల్ మొదటి సారి చేస్తున్న యాక్షన్ గ్రాండియర్ ని దింపడం రిస్క్ అవుతుంది. పైగా ఇలాంటివి సోలోగా వస్తేనే బెటర్. ఎంత జనాలు ఎక్కువ సినిమాలు చూసే మూడ్ లో ఉన్నా మరీ ఇన్నేసి వస్తే లేనిపోని కన్ఫ్యూజన్ కి తావిచ్చి దాని వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. నిర్మాత అనిల్ సుంకర ఏ ప్లాన్ తో ఇలా డిసైడ్ చేశారో చూడాలి.
ఊహించని ఈ షాక్ కి అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. వాళ్ళ హీరోలకు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ లో పెద్దగా కాంపిటేషన్ లేదు కాబట్టి ఆ టైంలో వస్తే బెటరని వాళ్ళ అభిప్రాయం. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏజెంట్ షూటింగ్ ఇంకా బాలన్స్ ఉంది. ఎంతనేది బయటికి చెప్పడం లేదు కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేస్తానని మాటిచ్చారట. అలాంటప్పుడు అదే నెలలో థియేటర్లలో దింపడం సాధ్యం కాదు. టీజర్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు. మరి ఏజెంట్ ఎందుకు ఝలక్ ఇచ్చాడబ్బా
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…