బీజేపీ రాంగట, కేసీఆర్ రైటా ?

కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళని ఏ విషయంలో అయితే తప్పుపడుతున్నారో అవే తనకు కూడా వర్తిస్తాయని ఏ మాత్రం అంగీకరించరు. తాజాజా మీడియా సమావేశంలో నరేంద్రమోడిని, బీజేపీని అనేక విషయాల్లో తప్పుపట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించదా ? చట్టాలను ఫాలో అవ్వవా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా ? ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి లాగేసుకుంటారా ? నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా ? ప్రజాస్వామ్యమంటే బీజేపీకి అసలు లెక్కలేదా ?

ఇవి తాజాగా బీజేపీని ఉద్దేశించి కేసీయార్ సంధించిన ప్రశ్నలు. నిజానికి ఇదులో చాలావరకు తనకు కూడా వర్తిస్తాయని కేసీయార్ మరచిపోయారో లేదా కన్వీనియంటుగా మరచిపోయినట్లు నటించారో అర్ధంకావటం లేదు. విషయం ఏమిటంటే 2014లో కేవలం 62 సీట్లతో అధికారంలోకి వచ్చిన కేసీయార్ తర్వాత చేసిందేమిటి ? టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాగేసుకోలేదా ? పై పార్టీల ఎంఎల్ఏలను ఒత్తిడి పెట్టి మరీ లాక్కున్నారు కదా.

కేసీయార్ ఏమన్నా చట్టాలను ఫాలో అవుతున్నారా ? కేంద్రానికి వ్యతిరేకంగా తాను మాత్రం ఆందోళనలు చేస్తు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అనుకుంటున్న ప్రతిపక్షాలను చేయనిస్తున్నారా ? ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడిచేయటం లేదా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్న కేసీయార్ మాత్రం లెక్కచేస్తున్నారా ? విభజన చట్టాని సక్రమంగా అమలు చేయమని హైకోర్టు ఆదేశిస్తే అమలుచేశారా ? పార్లమెంటు ద్వారా ఏర్పడిన విభజన చట్టాన్ని గౌరవించకుండా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర స్ధాయి సంస్ధలన్నీ తెలంగాణావే అని ఏకపక్షంగా సొంతం చేసుకోలేదా ?

నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా అని అడగటంలో కూడా అర్ధం లేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటి సీట్లు గెలిచిన చోటకూడా ఏదో పద్దతిలో వాళ్ళని లోబరుచుకుని టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చిందనిపించుకోలేదా ? ఇదంతా చట్టంపైన గౌరవముండే కేసీయార్ చేశారా ? కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలా వ్యవహరిస్తున్నారని కేసీయార్ ఆరోపిస్తున్నారో రాష్ట్రంలో తాను సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారని కేసీయార్ మరచిపోవటమే విచిత్రం.